AP Politics: కడప జిల్లా పులివెందుల టీడీపీ కార్యాలయంలో బీటెక్ రవి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ఈ రోజు పులివెందులలో ఓటుకు 2000 పంచే దీనస్థితికి వచ్చారంటే ప్రజల్లో వ్యతిరేకతోందని ఓటమిని అంగీకరించినట్లే అని అన్నారు. జగన్ డబ్బులు ఇవ్వలేదని ఎక్కడైనా ప్రమాణం చేసి చెప్పాలంటూ ఆయన సవాల్ చేశారు. ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రిగా, ఎంపీలుగా చేసిన వాళ్లు ఈరోజు ఓటర్లకు భయపడి పరిస్థితి ఉందన్నారు. ఎక్కడ మాకు వ్యతిరేకత ఉందో అని ఓటుకు 2000 పంచుకునే స్థితికి వచ్చారంటే నైతికంగా మేము విజయం సాధించినట్లే అని ఆయన దీమా వ్యక్తం చేశారు. మీ కుటుంబానికి మంచి జరిగితే నాకు ఓటు వేయండి అని జగన్ అంటున్నారు.. మంచి జరగడమంటే కరెంట్ బిల్లు పెరగడమా.? రైతులకు ఇన్సూరెన్స్, డ్రిప్ పరికరాలు పంపిణీ చేయకపోవడం మంచా..? దాదాపు 1400 మంది జగన్రెడ్డి మందు తాగి చనిపోవడం అది నువ్వు కుటుంబానికి చేసే మేలా.? మద్యం నాసిరకంగాను, అధిక రేట్లకు అమ్మడం మేలా..? ఒక్క ఇండస్ట్రీ తెచ్చేదానికి కూడా మీకు లేదు..? ఇక్కడ నిరుద్యోగులను ఇబ్బంది పెట్టడం మేలా..? అంటూ బీటెక్ రవి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..AP Politics: నాది ఫ్యాక్షన్ కుటుంబమే.. చావడానికైనా చంపాడానికైనా సిద్ధం: బీటెక్ రవి
కడప జిల్లా పులివెందుల టీడీపీ కార్యాలయంలో బీటెక్ రవి మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ ఈ రోజు పులివెందులలో ఓటుకు 2000 పంచే దీనస్థితికి వచ్చారంటే ప్రజల్లో వ్యతిరేకతోందని ఓటమిని అంగీకరించినట్లే అని అన్నారు. పేదవాడినైనా నాకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Translate this News: