RS Praveen Kumar: నన్ను చంపేందుకు దొరల కుట్ర.. రూ.కోటి సుఫారీ.. RS ప్రవీణ్ సంచలన ఆరోపణలు

తనను చంపేందుకు దొరలు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. సిర్పూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి బహిరంగంగా బీఎస్పీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.

RS Praveen Kumar: నన్ను చంపేందుకు దొరల కుట్ర.. రూ.కోటి సుఫారీ.. RS ప్రవీణ్ సంచలన ఆరోపణలు
New Update

జైలుకు పోవడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలంగాణ బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ (RS Praveen Kumar) స్పష్టం చేశారు. తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. గడీలు కూలబోతున్నాయన్న భయంతో దొరలు తనను అంత చేయబోతున్నారని ఆరోపించారు. బెల్లి లలిత, మారోజు వీరన్న, సాంబశివుడిలాగనే తనను కూడా చంపుతారని సంచలన వాఖ్యలు చేశారు.

తన వెంట ఉంటున్నాడని సూర్యాపేటలో వట్టె జానయ్యను చంపడానికి కోటి రూపాయల సుఫారీ కూడా ఇచ్చారన్నారు. సిర్పూర్ లో ఫలితం తేడా వస్తే బీఎస్పీ వారిని ఖతం చేస్తామని కోనేరు కోనప్ప బహిరంగంగా చెబుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. తన ఇంటి వద్ద గార్డును నియమించాలని కోరుతున్నా పోలీస్ శాఖ పట్టించుకోలేదన్నారు. తన చావు కూడా జనం మధ్యలోనే ఉంటుందన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

#telangana-elections-2023 #rs-praveen-kumar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe