MLA KTR: హైదరాబాద్ వాసులు ఆందోళనలో ఉన్నారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

TG: హైదరాబాద్‌లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు BRS నేత కేటీఆర్. పత్రికల్లో మొదటి పేజీ కథనాలే ఇందుకు నిదర్శనం అని చెప్పారు. పరిపాలన అనుభవం లేని నాయకత్వం అంతటా కనిపిస్తోందని.. హైదరాబాద్‌ ప్రతిష్ఠ మసకబారడంపై ప్రతి ఒక్కరిలో ఆవేదన ఉందని అన్నారు.

New Update
MLA KTR:  రుణమాఫీతో రైతులను మోసం చేస్తోంది..  రేవంత్ సర్కార్‌పై  కేటీఆర్ ఫైర్

MLA KTR: హైదరాబాద్‌లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని అన్నారు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్. పత్రికల్లో మొదటి పేజీ కథనాలే ఇందుకు నిదర్శనం అని చెప్పారు. పరిపాలన అనుభవం లేని నాయకత్వం అంతటా కనిపిస్తోందని అన్నారు. హైదరాబాద్‌ ప్రతిష్ఠ మసకబారడంపై ప్రతి ఒక్కరిలో ఆవేదన ఉన్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సీఎం వెళ్తున్నా పోలీసింగ్‌పై కమాండ్‌ ఏది? అని నిలదీశారు. కాంగ్రెస్‌ పవర్‌లోకి రాగానే గడియ గడియకు పవర్‌ కట్‌ జరుగుతుందని ఆరోపించారు. చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న రాజధానిపై శ్రద్ధ లేకపోతే ఎలా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్‌ దెబ్బతింటే రాష్ట్రానికే కాదు.. దేశానికీ నష్టం అని అన్నారు.

Advertisment
తాజా కథనాలు