BRS Party: బీఆర్ఎస్ 'స్వేద పత్రం' వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

తెలంగాణ భవన్ లో ఈ రోజు ఉదయం 11 గంటలకు జరగాల్సిన 'స్వేద పత్రం' పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు ప్రకటించాయి. రేపు ఈ కార్యక్రమం ఉంటుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ ఉంటుందన్నారు.

New Update
KTR: కాంగ్రెస్‌కు కౌంటర్.. నేడు కేటీఆర్ 'స్వేద పత్రం' విడుదల

ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి కౌంటర్ గా నేడు 'స్వేద పత్రం' పేరతో పవర్ ప్రజంటేషన్ ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ భవన్ లో శనివారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అయితే.. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం వాయిదా పడినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. రేపు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందని వెల్లడించాయి. అయితే.. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలకు కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించనున్నారు.

అయితే.. 'స్వేద పత్రం' పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను ఎందుకు వాయిదా వేశారనే అంశంపై బీఆర్ఎస్ పార్టీ క్లారిటీ ఇవ్వలేదు.

Advertisment
తాజా కథనాలు