బ్రేకింగ్: అసెంబ్లీ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ యువకుడు..అలర్ట్ అయిన పోలీసులు!!

అసెంబ్లీ గేట్ ఎదుట ఓ యువకుడు సూసైడ్ అటెప్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ఒంటి పై పోసుకొని అంజి రెడ్డి అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా, తన భూమిని ప్రభుత్వం తీసుకొని పరిహారం ఇవ్వలేదని తీవ్ర మనస్థానం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు చెప్పిన అంజిరెడ్డి..

New Update
బ్రేకింగ్: అసెంబ్లీ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ యువకుడు..అలర్ట్ అయిన పోలీసులు!!

తెలంగాణ అసెంబ్లీ లోపల వాడీవేడీగా సమావేశాలు జరుగుతుంటే.. అసెంబ్లీ గేట్ ఎదుట ఓ యువకుడు సూసైడ్ అటెప్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ఒంటి పై పోసుకొని అంజి రెడ్డి అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి హల్ చల్ చేశాడు. అయితే పోలీసులు వెంటనే అలర్ట్ కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారిస్తున్నారు.

కాగా, తన భూమిని ప్రభుత్వం తీసుకొని పరిహారం ఇవ్వలేదని తీవ్ర మనస్థానం చెంది అంజిరెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు అతని దగ్గర్నుంచి పూర్తి డీటైల్స్ సేకరిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు