తీవ్రమైన నేరం విషయంలో, ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయకూడదని సుప్రీంకోర్టు(Supreme court) చెప్పింది. కేసుల సత్వర పరిష్కారానికి వెబ్సైట్ను సిద్ధం చేయాలని ఆదేశించింది. దోషిగా తేలిన ఎంపీ/ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై ఇంకా విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు/ఎమ్మెల్యేలపై ఎన్నికల నుంచి జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిల్పై కోర్తు ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ/ఎమ్మెల్యేలపై కేసుల సత్వర పరిష్కారానికి సంబంధించి ట్రయల్ కోర్టులకు ఒక యూనిఫామ్ గైడ్లైన్స్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎంపీలు/ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులను సమర్ధవంతంగా పర్యవేక్షించడం, పరిష్కరించడం కోసం సుమోటోగా కేసు నమోదు చేయాలని హైకోర్టులను సుప్రీంకోర్టు కోరింది.
పూర్తిగా చదవండి..BREAKING: రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం కేసు… సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు/ఎమ్మెల్యేలపై ఎన్నికల నుంచి జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రతినిధులపై పెండింగ్లో ఉన్న కేసులను పర్యవేక్షించేందుకు హైకోర్టు ప్రధాన జడ్జిలు సుమోటోగా కేసును స్వీకరించాలని కోర్టు ఆదేశించింది.
Translate this News: