CM Jagan: సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్..!

పశ్చిమ గోదావరి తేతలి వద్ద సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. రేపు ఉదయం వరకు జగన్ తేతలి శిబిరం వద్ద విశ్రాంతి తీసుకోనున్నారని తెలుస్తోంది. గోదావరి జిల్లాల నుంచి నాయకులు సీఎంను కలిసేందుకు వచ్చారు. కానీ, ఆయనను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు.

CM Jagan: సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్..!
New Update

CM Jagan: ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. సభలు నిర్వహిస్తూ ప్రతిపక్ష్యాలపై విరుచుకుపడుతున్నారు. అయితే, తాజాగా,  పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి వద్ద సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. రేపు ఉదయం వరకు సీఎం జగన్ తేతలి వద్దే వుండనున్నారు. శిబిరం వద్ద విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జగన్ బస చేస్తున్న ప్రాంతం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read: నా ఫోన్‌లను బీఆర్‌ఎస్ ట్యాప్ చేసింది.. బలమైన ఆధారాలున్నాయి!

సీఎంను కలిసేందుకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శిబిరం వద్దకు చేరుకున్నారు. అయితే, సీఎంను కలిసేందుకు అనుమతి లేదంటూ భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో, నాయకులు మౌనంగా వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.మరల రేపు ఉదయం అంబేద్కర్ కోమసీమ జిల్లా రావులపాలెం వద్ద జగన్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు.

#cm-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe