Brahmamudi: ట్విస్ట్ అదిరింది.. ఇంట్లోకి మాయ ఎంట్రీ..! కళ్యాణ్ కు షాకిచ్చిన కనకం..!

అప్పు, కళ్యాణ్ హోటల్ రూమ్ లో దొరికిపోవడంతో ఇంట్లో పెద్ద పంచాయితీ పెడుతుంది అనామిక. మరో వైపు కనకం ఇంకోసారి కళ్యాణ్ మా ఇంటికి వస్తే మొహం పైనే తలుపు వేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi: ట్విస్ట్ అదిరింది.. ఇంట్లోకి మాయ ఎంట్రీ..! కళ్యాణ్ కు షాకిచ్చిన కనకం..!

Brahmamudi: మాయ కోసం వెళ్లిన కళ్యాణ్, అప్పు హోటల్ రూమ్ లో దొరికిపోవడంతో ఇంట్లో అందరి ముందు పంచాయితీ పెడతారు ధాన్యలక్ష్మి , కనకం. ఇప్పుడు చెప్పండి వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహమా..? ఇకేదైనానా..? ఎప్పటి నుంచి నడుస్తుంది ఈ బాగోతం. ఎన్నాళ్ల నుంచి ఇలా సీక్రెట్‌గా కలుస్తున్నారు అని అందరి ముందు భర్త కళ్యాణ్, అప్పును అవమానిస్తుంది అనామిక.

publive-image

మరో వైపు ధాన్యలక్ష్మి కూడా .. ఎందుకురా ఇలా చేశావు. అందరి ముందు తలెత్తుకోకుండా చేశావ్. ఎన్నాళ్లుగా ఇలా కలుసుకుంటున్నారు అని కొడుకు పై ఆవేశపడుతుంది.

publive-image

ఇక కళ్యాణ్ మాత్రం అడ్డమైన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీచంగా నిందలు వేస్తుంటే తలవంచాల్సిన అగత్యం లేదు అని కల్యాణ్ అంటాడు. మరో వైపు స్వప్న.. అనామిక అన్ని మాటలంటుంటే సైలెంట్ ఉంటావేంటి అని అప్పు పై కోప్పడుతుంది.

publive-image
దాంతో అప్పు.. ఒకప్పుడు నేను కళ్యాణ్ ను ప్రేమించాను. కానీ అనామిక పెళ్ళైనప్పుడే అంతా మర్చిపోయాను. కానీ ప్రతీసారి కళ్యాణ్ తో నా స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అనామిక నన్ను ఇంతగా అవమానించిన సైలెంట్ గా ఉండడానికి కారణం.. ఈ ఇంట్లో ఉన్న నా అక్కల కోసం మాత్రమే అని ఎమోషనల్ అవుతుంది అప్పు.

publive-image

ఇంతలో ఎంట్రీ ఇచ్చిన కనకం.. అప్పు పై నిందలు వేయడంతో అనామిక పై రెచ్చిపోతుంది. నేను నీ కన్నా ఎక్కువ చదువుకోలేదు. నేను మీ కన్నా నీచంగా మాట్లాడగలను. నీచంగా నిందలు వేయగలను అని అనామికను పై ఫైర్ అవుతుంది ధాన్యలక్ష్మి. ఇంకోసారి కళ్యాణ్.. స్నేహితుడిగా, బంధువుగా గానీ మా ఇంటికి వస్తే మొహం పై తలుపు వేస్తానని అనామిక, ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది.

publive-image
మరో వైపు రాజ్ అస్సలు కళ్యాణ్, అప్పు హోటల్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పాలని నిలదీస్తాడు. ఇక కళ్యాణ్, అప్పు మాత్రం మౌనంగా ఉండిపోతారు. దీంతో రాజ్ మీరు ఇద్దరు మౌనంగా ఉంటే వేసిన నింద నిజమవుతుంది అని హెచ్చరిస్తాడు. ఇంతలో కావ్య నేను చెప్తాను అని ముందుకు వస్తుంది.

publive-image

కావ్య అలా అనడంతో షాక్ అవుతాడు రాజ్. అంటే వారిద్దరూ హోటల్ కు వెళ్లిన సంగతి నీకు తెలుసా అని భార్యను ప్రశ్నిస్తాడు. దీంతో కావ్య వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. అసలు మాయను పట్టుకోవడానికి వెళ్లామని అసలు నిజం బయటపెడుతుంది.

publive-image

ఇక అనామిక మాత్రం కావ్య చెప్పిన మాటలను అస్సలు పట్టించుకోదు. బాగానే కట్టు కథ అల్లావు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో కావ్య నీ కళ్ళుకు అనుమానపు పొరలు కమ్ముకున్నాయి. ఇక ఆ భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడు అని కావ్య అంటుంది.

publive-image

ఆ తర్వాత అనామిక మళ్ళీ భర్త కళ్యాణ్ పై కోప్పడుతుంది. ఛీ.. ఛీ భార్య ఉండక ఇంకో అమ్మాయితో తిరిగేందుకు నీకు మనసెలా వచ్చింది. అసలు నీకు ఎవరి బుద్ధులు వచ్చాయో అని సుభాష్‌ను ఉద్దేశించి కళ్యాణ్ పై ఫైర్ అవుతుంది. దీంతో ఇందిరాదేవి నోర్మూయి నువ్వు ఎంత నీ బుతుకెంత. నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడతావా అని అనామిక దుమ్ముదులిపేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Mr Bachchan: మిస్టర్ బచ్చన్ ‘షో రీల్’.. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌

Advertisment
తాజా కథనాలు