Vishaka: ప్రియురాలిపై విషప్రయోగం చేసిన ప్రియుడు అరెస్ట్..!

విశాఖలో ప్రియురాలిపై విషప్రయోగం చేసిన ప్రియుడు అరెస్ట్ అయ్యాడు. నర్సీపట్నంకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు రత్నమాధురి, శేఖర్ గత ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి ఇష్టం లేని ప్రియుడు ఆమెపై విషప్రయోగం చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మరణించిన విషయం తెలిసిందే.

New Update
Vishaka: ప్రియురాలిపై విషప్రయోగం చేసిన ప్రియుడు అరెస్ట్..!
Vishaka: ప్రియురాలిపై ప్రియుడు విషప్రయోగం చేయడంతో ఆమె మృతి చెందింది. దీంతో, ప్రియుడు అరెస్ట్ అయి జైలు పాలయ్యాడు. ఈ దారుణమైన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. నర్సీపట్నంకు చెందిన రత్నమాధురి, శేఖర్ హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు గత ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. యువతి పెళ్లి చేసుకుందామని శేఖర్ ను అడిగింది. దీంతో, పెళ్లి ఇష్టం లేని ప్రియుడు మనం ఆత్మహత్య చేసుకుందాం అని నమ్మించాడు.
జనవరి నెల 27న ఇద్దరు విశాఖలోని ఓ లాడ్జిలో రూం తీసుకున్నారు. అనుకున్నట్లుగానే ప్రియురాలిపై విషప్రయోగం చేశాడు. తరువాత అదేరోజు రాత్రి ఆమెని ప్రియుడు శేఖర్‌ శారదానగర్‌లో ఆమెను ఇంటివద్ద దిగబెట్టి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ప్రియురాలు రత్న మాధురి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

యువతి సెల్ ఫోన్ లో  శేఖర్‌ ఒక పాయిజన్ బాటిల్ ఫొటోను వాట్సాప్‌లో పంపినట్లు చూశారు. దీంతో తమ కుమార్తెపై విష ప్రయోగం జరిగిందని తల్లి అమ్మాజీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొమ్మిది రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రత్నమాధురి మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణానికి కారణమయ్యాడన్న ఆరోపణపై వెన్నపాలేనికి చెందిన శేఖర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పట్టణ సీఐ తెలిపారు. నిందితుడు శేఖర్ తమ వద్ద స్వచ్ఛందంగా లొంగిపోయాడని, దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.
Advertisment
తాజా కథనాలు