Crime: వీడేం ప్రియుడు రా దేవుడా.. నడిరోడ్డుపై ప్రియురాలిని నరికేసి..!

ఏలూరు జిల్లా సత్రంపాడులో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలి రత్న గ్రేసిపై ప్రియుడు యేసు రత్నం అతిదారుణంగా కత్తితో దాడి చేసి చంపాడు. అనంతరం తనకు తాను పీక కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యేసు రత్నం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

New Update
Crime: వీడేం ప్రియుడు రా దేవుడా.. నడిరోడ్డుపై ప్రియురాలిని నరికేసి..!

West Godavari: ఏలూరు జిల్లా సత్రంపాడులో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలి రత్న గ్రేసిపై ప్రియుడు యేసు రత్నం అతిదారుణంగా కత్తితో నరికి చంపాడు. అనంతరం తనకు తాను పీక కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యేసు రత్నం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు ఎంఆర్సి కాలనీకి చెందిన రత్న గ్రేసిగా గుర్తించారు.

Also read: ప్రియుడి టార్చర్‌.. రోడ్డుపైనే పలుసార్లు ఇలా వేధించేవాడు..!

కొంతకాలంగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహరం నడిచింది. పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ముందు తనను పొడవమని యేసురత్నం ప్రియురాలికి కత్తిచ్చాడు. ప్రియుడిని చంపేందుకు ధైర్యం సరిపోక గ్రేసీ నో చెప్పింది. దీంతో కత్తి తీసుకుని గ్రేసీ మెడ కోసి తాను కూడా గొంతు కోసుకున్నాడు.

యేసు రత్నం అంత క్రూరంగా చంపేంత కారణం ఏముందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, పక్కా ప్లాన్ ప్రకారమే యేసు రత్నం ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. తన కాలేజీ బ్యాగ్‌లో మటన్‌ కోసే కత్తి వెంట తెచ్చుకున్నాడని.. మాట్లాడుకుందాం రమ్మని పిలిచి నడిరోడ్డుకుపై రత్న గ్రేసి గొంతుకోశాడని స్థానికులు చెబుతున్నారు. ఆ తరువాత తాను గొంతుకున్నాడని తెలిపారు. ప్రస్తుతం యేసు రత్నం పరిస్థితి విషమంగా ఉంది.

Advertisment
తాజా కథనాలు