Bonda Uma: జగన్ పై దాడి చేసింది వాళ్లే.. దమ్ముంటే సీబీఐ చేత విచారణ జరిపించండి..!

సీఎం జగన్ దాడిపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పైన దాడి చేసింది ఐపాక్ టీం అని ఆరోపించారు. ఈ దాడి మొత్తం ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు. దాడి మొత్తాన్ని అమలు చేసింది కేశినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ అని అన్నారు.

Bonda Uma: జగన్ పై దాడి చేసింది వాళ్లే.. దమ్ముంటే సీబీఐ చేత విచారణ జరిపించండి..!
New Update

Bonda Uma: సీఎం జగన్ దాడిపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పైన దాడి చేసింది ఐపాక్ టీం అని ఆరోపించారు. ఈ దాడి మొత్తం ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు.సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి కారణం.. ఇక్కడ దాడి చేస్తే హైలెట్ అవ్వొచ్చు అనే చేసారన్నారు. జగన్ పై దాడి మొత్తాన్ని అమలు చేసింది కేశినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ అని అన్నారు. కంటికి గాయం అయినట్టు వెల్లంపల్లి డ్రామాలు ఆడుతున్నాడన్నారు.

Also Read: సీఎం జగన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి తీసుకెళ్తా.. మీడియా సమక్షంలో నిజాలు బయటపెడతా.. వెల్లంపల్లికి వచ్చే దమ్ముందా? అని సవాల్ విసిరారు. టీడీపీపై బురద జల్లితే సానుభూతి వస్తుందని జగన్ నమ్ముతున్నాడని పేర్కొన్నారు. ఈసారి జగన్ ఆటలు సాగవని కామెంట్స్ చేశారు. ఈ దాడి కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్ చేసిందన్నారు. వైసీపీకి దమ్ముంటే సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

#bonda-uma
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe