/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Ranibir-Kapoor-jpg.webp)
ED Summons to Ranbir Kapoor: ఆన్లైన్ బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 6న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది. మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ కేసులో చాలా మంది బాలీవుడ్ నటులు, సింగర్స్ ప్రమేయం ఉండొచ్చని ఈడీ భావిస్తోంది. ఈనేపథ్యంలో అనుమానాస్పదంగా ఉన్నవారిపై ఈడీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల యూఏఈలో జరిగిన యాప్ ప్రమోటర్ వివాహానికి, సక్సెస్ పార్టీకి రణబీర్ హాజరు కావడంపై కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో తాజాగా రణ్బీర్ కపూర్కు నోటీసులు జారీ చేసింది ఈడీ.
Actor Ranbir Kapoor summoned by Enforcement Directorate on 6th October, in connection with Mahadev betting app case
(file photo) pic.twitter.com/K8DZhME5RK
— ANI (@ANI) October 4, 2023
Also Read: