తెలంగాణలో మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికార, విపక్ష నేతల ప్రచారాలతో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నడుమ తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల 115 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార జోరు పెంచేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మొదటి అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. రెండో అభ్యర్థుల జాబితాను ఈరోజు విడుదల చేస్తుందన్న ప్రచారం సాగుతోంది. ఇక బీజేపీ 52 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయగా.. కేవలం ఒకే ఒక్క అభ్యర్థితో రెండో జాబితాను ఈ రోజు ప్రకటించింది. త్వరలోనే పూర్తి జాబితాను విడుదల చేయనుంది.
పూర్తిగా చదవండి..తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ బ్రహ్మాస్త్రం ఇదే.. నేడు అమిత్ షా సంచలన ప్రకటన?
రానున్న ఎన్నికల్లో తమకు బ్రహ్మాస్త్రం ఉందని బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో.. బీసీలను సీఎం చేస్తామని ఆ పార్టీ అగ్రనేతలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేకుంటే ఎస్సీ, ఎస్టీ సీఎం అన్న నినాదంతో అయినా వారు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఉంది.
Translate this News: