/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/bjp-mp.jpg)
భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ హరిద్వార్ దూబే (74) కన్నుమూశారు. ఆదివారం నాడు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 74సంవత్సరాలు.
2020లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నియ్యారు. అంతకుముందు యూపీలోని కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. హరిద్వార్ దూబే సంఘ్ ప్రచారకుడు. క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందు, అతను సీతాపూర్, అయోధ్య, షాజహాన్పూర్లలో RSS జిల్లా ప్రచారక్ గా సేవలందించారు.
Agra | BJP's Rajya Sabha MP, Haridwar Dubey, passes away at the age of 74 at a hospital in Delhi, says his son Pranshu Dubey
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 26, 2023
హరిద్వార్ దూబే స్వస్థలం బల్లియా. చాలా కాలం పాటు ఆగ్రా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఆయన 1969లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంస్థాగత మంత్రిగా ఆగ్రాకు వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడి రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో ఆగ్రా కంటోన్మెంట్ నుంచి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1991లో కూడా గెలిచారు. సంస్థాగత ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా చేశారు.
2005లో ఖేరాగఢ్ అసెంబ్లీ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2011లో రాష్ట్ర అధికార ప్రతినిధి, 2013లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.