భారతీయజనతా పార్టీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉంది. కర్నాటక ప్రజలు ఇచ్చిన తీర్పుతో అప్రమత్తమైన బీజేపీ..దక్షిణ రాష్ట్రాలపై ఫోకస్ మరింత పెంచింది. అందులోనూ తెలంగాణపై మరింత ద్రుష్టిసారించింది. పార్టీలో ఉన్న విభేదాలను తొలగించే వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
పూర్తిగా చదవండి..ఎవరినీ ఉపేక్షించం.. టీబీజేపీ నేతలకు నడ్డా వార్నింగ్.. ఎందుకో తెలుసా..?
బీజేపీ అధిష్టానం ఫోకస్ అంతాకూడా తెలంగాణపైన్నే. ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలన్న పక్కా ప్లాన్ తో...పావులు కదుపుతోంది. ఇప్పటికే ఉత్తరానా, పశ్చిమానా, ఈశాన్యం అంతా కమలం వికసిస్తుంటే..దక్షిణం ఒక్కటే కాషాయ పార్టీ వ్యూహాలకు చిక్కడం లేదు. ఎలాగైనా దక్షిణంలో పాగా వేయాలన్న ఉద్దేశ్యంతో మరో యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. అయితే తెలంగాణలో మాత్రం కాషాయం పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపం ఢిల్లీ పెద్దలకు తలనొప్పిగా మారింది. పార్టీలో విబేధాలు ఇప్పటికే రచ్చకెక్కాయి. పార్టీ అధ్యక్షుడి మార్పు...పలువురు నేతలకు క్లాప్ పీకడం లాంటివి చకచకా జరిగాయి. అయితే పార్టీలోని కొంతమంది నేతలు ప్రతి విషయానికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం..అధిష్టానానికి మింగుడుపడటం లేదు. ఈనేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలోకి దిగారు. టీబీజేపీ నేతలకు క్లాప్ పీకారు. గ్రూపులు రాజకీయాలు పక్కనపెట్టి కలిసి కట్టుగా పనిచేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు. గీత దాటి ముందుకు వచ్చారో తాట తీస్తానంటూ చెప్పకనే చెప్పారు.
Translate this News: