MLA Raghunandan Rao: గజ్వేల్ అభివృద్ధి అంశంపై జరుగుతున్న వివాదంలో తగ్గేదేలే అంటున్నారు బీజేపీ నేతలు. గజ్వేల్ అభివృద్ధిని పరిశీలించాల్సిందే.. జనాలకు నిజాలు చెప్పాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. మొన్నటికి మొన్న ఇదే అంశంపై కామారెడ్డికి చెందిన మాజీ జెడ్పీ చైర్మన్ వెంకట రమణా రెడ్డి గజ్వేల్ అభివృద్ధి ఏంటో చూస్తానంటూ బయలుదేరగా.. అయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. దాంతో మొదలైన వివాదం.. రోజు రోజుకు మరింత రచ్చగా మారుతోంది. తాజాగా ఇదే అంశంపై దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇతర రాష్ట్రాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును చూడటానికి వచ్చిన వారికి హెలికాప్టర్లు ఏర్పాటు చేసిన కేసీఆర్.. పొరుగు నియోజకవర్గం వాళ్లు గజ్వేల్ అభివృద్ధిని చూసేందుకు వెళ్తే కేసీఆర్ ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Raghunandan Rao: అప్పుడు ఎలా ఆపుతారో చూస్తాం.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రఘునందన్..
ఇతర రాష్ట్రాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును చూడటానికి వచ్చిన వారికి హెలికాప్టర్లు ఏర్పాటు చేసిన కేసీఆర్.. పొరుగు నియోజకవర్గం వాళ్లు గజ్వేల్ అభివృద్ధిని చూసేందుకు వెళ్తే కేసీఆర్ ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.
Translate this News: