బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి ప్రధాని మోదీ వస్తున్నారని ఈటల అన్నారు. ఎన్నో ఏళ్ల కల అయిన వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నారని స్పష్టం చేశారు. మొదటి సారిగా వరంగల్ జిల్లాకు ప్రధాని వస్తున్న సందర్భంగా ఘనస్వాగతం పలకాలని ప్రజలను కోరుతున్నానని ఈటల కోరారు. బీజేపీకి బలమైన కేంద్రంగా వరంగల్ జిల్లా ఉందంటూ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ శ్రేణులు మొత్తం ప్రధాని సభ పోల్ విజయం కోసం పనిచేస్తున్నామని తెలిపారు. కొంతమంది కావాలనే తమపై లేనిపోని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, మేము తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేస్తామని తెలిపారు. తెలంగాణ గడ్డ మీద 2019 నుండి బీజేపీ విజయ పరంపర మొదలైందని తెలిపారు.
పూర్తిగా చదవండి..మాపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారంటూ ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
తమపై కొంతమంది, మీడియా సంస్థలు విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇటీవల ఈటలను బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమించిన మనందరికి తెలిసిన విషయమే. జులై 8న వరంగల్లో జరగనున్న బీజేపీ విజయసంకల్ప సభ ఏర్పాట్లను ఈటల పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈటల కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Translate this News: