K'taka Fuel Prices: పెరిగిన పెట్రోల్‌ ధరలకు నిరసన చేస్తూ గుండెపోటుతో బీజేపీ నేత మృతి

పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా బీజేపీ ఈరోజు కర్ణాటకలో నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎంబీ భానుప్రకాష్ ప్రసంగిస్తూ గుండెపోటుతో మరణించారు. దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.

K'taka Fuel Prices: పెరిగిన పెట్రోల్‌ ధరలకు నిరసన చేస్తూ గుండెపోటుతో  బీజేపీ నేత మృతి
New Update

BJP Leader Bhanuprakash: కర్ణాటకలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎంబీ భానుప్రకాష్ సోమవారం గుండెపోటుతో మరణించారు. దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.

భానుప్రకాష్ ఎవరు?

భానుప్రకాష్‌ వయసు 69 ఏళ్లు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. కర్ణాటకలోని శివమొగ్గలో నిరసనకు నాయకత్వం వహించిన ఆయన చనిపోయే ముందు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.

ధరల పెంపుపై బీజేపీ నిరసన..

ధరల పెరుగుదలను నిరసిస్తూ సోమవారం కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసన చేపట్టింది. శనివారం, కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై అమ్మకపు పన్నును పెంచింది, దీంతో నిత్యావసర వస్తువుల ధర పెరిగింది. ప్రభుత్వ చర్య తర్వాత, పెట్రోల్ ధర లీటరుకు రూ. 3 పెరిగింది. డీజిల్ ధరలు లీటరుకు రూ.3.5 పెరిగాయి .

కర్నాటకలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర రాజధాని బెంగళూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరికి నిరసనగా నిరసన తెలిపారు.

#bjp-leader-bhanuprakash
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe