తెలంగాణలో బీజేపీ పరిస్థితి చిత్రవిచిత్రంగా కనిపిస్తోంది. నిన్నమొన్నటివరకు బీఆర్ఎస్కు తామే నిజమైన ప్రత్యర్థులమని కనపడిన వారికి నేరుగా..కనపడని వారికి టీవీల్లో చెవులు చిల్లులుపడేలా చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు సైలెంట్ ఐపోయారు. బీఆర్ఎస్ అసంతృప్తి నేతలు తమ పార్టీలోకే వస్తారనుకుంటే వాళ్లు కాస్త కాంగ్రెస్ వెనకాలపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. వచ్చేవాళ్లు రాకపోగా.. బీజేపీ నుంచే వెళ్లిపోయేవాళ్లు ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు పేల్చిన బాంబు ఢిల్లీ వరకు వినపడింది. ఇంతకీ రఘునందన్రావు ఏమన్నారు..? ఆయన వ్యాఖ్యలు ఎందుకింతలా దుమారం రేపుతున్నాయి..?
పూర్తిగా చదవండి..నేనైతే దున్నేసేవాడిని.. బండికి ఆ వంద కోట్లు ఎక్కడవి? నడ్డాపై మోదీకి ఫిర్యాదు చేస్తానంటూ రఘునందన్ బాంబ్!
తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కలకలం రేగింది. ఆ పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ బీజేపీ ఛీఫ్ బండి సంజయ్పై ఆరోపణలు గుప్పించడం చర్చకు దారి తీసేలా చేసింది. ఒకప్పుడు పుస్తెలు అమ్మి బరిలోకి దిగిన బండికి ఇవాళ వందల కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇచ్చే స్థాయికి ఎలా వచ్చారంటూ ప్రశ్నించారు. అంతేకాదు తన సేవకు ప్రతిఫలం రాకపోతే నడ్డాపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానంటూ బాంబు పేల్చారు రఘునందన్.

Translate this News: