Bigg Boss 7 Telugu: శోభ పేరు టాటూ వేయించుకోవాలి.. తేజకు షాకిచ్చిన బిగ్ బాస్..!

బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ కి సంబంధించిన టాస్క్ లో ఎక్కువ లెవెల్స్ గెలిచి జిలేబీపురం టీం సభ్యులు విన్ అయ్యారు. ఇక టాస్క్ పూర్తయ్యాక బిగ్ బాస్ తేజకు కేక్ పంపడంతో పాటు ఆ కేక్ పై శోభ పేరు రాశారు. దాంతో ఆ కేక్ వాళ్ళిద్దరే తినాలా.. లేదా ఎవరైనా తినొచ్చా.. ఒక వేళ తింటే ఏమవుతుంది అంటూ చాలా డిస్కషన్స్ జరిగాయి. అంతే కాదు ఆ కేక్ విషయంలో శోభ, అమర్ ఇద్దరి మధ్య కాస్త ఆర్గుమెంట్ కూడా జరిగింది.

Bigg Boss 7 Telugu: శోభ పేరు టాటూ వేయించుకోవాలి.. తేజకు షాకిచ్చిన బిగ్ బాస్..!
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ సంబందించిన రెండు లెవెల్స్ పూర్తయ్యాయి. గులాబీపురం, జిలేబీపురం మధ్య జరిగిన ఈ కెప్టెన్సీ టాస్క్ లో జిలేబీపురం టీమ్ సభ్యులు గెలిచారు. ఈ టాస్క్ మధ్యలో తేజకు (Teja) బిగ్ బాస్ పెద్ద షాకిచ్చాడు. తేజ మీరు శోభ (Shobha) పేరు టాటూ వేయించుకోవాలి అంటూ తేజ కోసం టాటూ డిజైన్స్ కూడా పంపారు బిగ్ బాస్ . దాంతో తేజ.. బిగ్ బాస్ శోభ పేరు ఎలా వేయించుకుంటాను, నేను వేయించుకోను బిగ్ బాస్ అంటూ ఫన్నీగా రిక్వెస్ట్ చేశాడు.

Also Read: నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది.. త్వరలోనే రెండోపెళ్లి.. రేణూ దేశాయ్ కీలక ప్రకటన..

సందీప్ VS అమర్
కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా నిన్న జరిగిన రెండో లెవెల్ లో అమర్, సందీప్ ఇద్దరు పోటీపడ్డారు. బిగ్ బాస్ వీళ్లకు ఇచ్చిన టాస్క్.. గ్రహాంతర వాసుల షిప్ ఇక్కడ ఆగిపోయింది దానికి కావలిసిన ఇంధనం స్విమ్మింగ్ పూల్ లో బాక్స్ లో ఉంటుంది ఆ బాక్స్ తాళాలు ఎవరు ముందుగా తీసి ఇంధనాన్ని తెస్తారో వాళ్ళు ఈ టాస్క్ లో విజేతలుగా నిలుస్తారని బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఈ టాస్క్ లో ముందుగా సందీప్ తాళాలు తీసి ఇంధనాన్ని బయటకు తీశాడు దాంతో సందీప్ టీం విన్ అయ్యింది. శోభ టీం టాస్క్ ఓడిపోయింది దాంతో శోభ టాస్క్ ఆడిన అమర్ (Amar) , తేజ పై గట్టిగ అరిచేసింది. గెలుస్తామని కాన్ఫిడెంట్ ఉంటేనే వెళ్ళాలి లేకపోతే ఉన్నవాళ్ళని పంపాలి అంటూ అరిచేసింది.

publive-image

గౌతమ్ సూపర్

కెప్టెన్సీ టాస్క్ నెక్స్ట్ రౌండ్ ప్రశాంత్ (Pallavi Prashanth), గౌతమ్ మధ్య జరిగింది. వీళ్లకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చిక్కుముళ్ళుగా ఉన్న చార్జ్ వైర్స్ ను విప్పి వాటిని సరైన కనెక్టర్స్ కి అటాచ్ చేయాలని చెప్పాడు. ఈ టాస్క్ మొదట్లో ప్రశాంత్, గౌతమ్ కన్నా ముందున్నప్పటికీ.. చివరిలో గౌతమ్ స్మార్ట్ గా ఆ చిక్కుముళ్ళను విప్పేసి ఈ టాస్క్ విన్ అయ్యాడు.

ఇక చివరిలో బిగ్ బాస్ తేజ కోసం కేక్ పంపాడు. ఆ కేక్ పై శోభ పేరు రాసి ఉంది. దాంతో పాటు తేజ ముందుంది ముసళ్ల పండగ అంటూ ఒక నోట్ కూడా పంపారు బిగ్ బాస్. ఇక ఆ కేక్  ఎవరు తినాలి అంటూ పెద్ద డిస్కషన్ జరిగింది. అమర్ నేనే తింటాను అనడంతో శోభ, అమర్ ఇద్దరు కి కాస్త ఆర్గుమెంట్ కూడా జరిగింది. కేక్ తింటే నామినేట్ అవుతారేమో, లేదా కేక్ తిన్నవాళ్ళు టాటూ వేయించుకోవాలేమో అంటూ చాలా చర్చలు చేసిన తేజ చివరికి తేజ ఆ కేక్ ను ఇంటి సభ్యులందరితో పంచుకున్నాడు.

Also Read: భగవంత్ కేసరి.. హిట్టా !! ఫట్టా !! ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌ ఏం అంటున్నారంటే?

#bigg-boss-7-telugu #bigg-boss-7-telugu-latest-updates #bigg-boss-7-latest-episode
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి