Bigg Boss 7 Telugu: ప్రశాంత్ తో రతిక ప్యాచప్.. ఆ మాటలకు ఏడ్చేసిన ప్రశాంత్..!

బిగ్ బాస్ సీజన్ 7 ఇంటి సభ్యులంతా బిగ్ బాస్ 'మారథాన్' లో భాగంగా జరుగుతున్న వివిధ టాస్కుల్లో పాల్గొని కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలవడానికి పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన మూడు టాస్కుల్లో సందీప్, గౌతమ్, శోభ ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎంపికయ్యారు.

Bigg Boss 7 Telugu: ప్రశాంత్ తో రతిక ప్యాచప్.. ఆ మాటలకు ఏడ్చేసిన ప్రశాంత్..!
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఇక నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన మూడు టాస్కుల్లో సందీప్, గౌతమ్, శోభ ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎంపికయ్యారు. ఇదివరకే జరిగిన రెండు టాస్కుల్లో ప్రియాంక, ప్రశాంత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక  వీళ్ళ ఐదుగురిలో ఎవరు కెప్టెన్ అనేది ఈ రోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.

ఫిల్ ఇట్.. పోర్ ఇట్

నిన్న కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ ఇచ్చిన మొదటి టాస్క్ 'ఫిల్ ఇట్ పోర్ ఇట్' ఈ టాస్క్ లో సందీప్, అశ్విని, భోలే, అర్జున్ పాల్గొన్నారు. ఈ టాస్క్ లో షవర్ నుంచి వచ్చే నీటిని వారి తల పై ఉన్న స్పాంజ్ లో ఫిల్ చేసి వాటిని కంటైనర్ లో ఫిల్ చేయాలి. ఈ టాస్క్ 3 రౌండ్స్ లలో జరిగింది. ఇక్కడ బిగ్ బాస్ ఈ ఆటలో పాల్గొనే సభ్యులకు ఒక మంచి అవకాశం ఇచ్చారు.. ఫస్ట్ రౌండ్ లో ఓడిపోయిన సభ్యులు తమ కంటైనర్ లో ఉన్న నీటిని ఇతర సభ్యులకు ఇచ్చి, వారు కంటెండర్స్ అవ్వడానికి సహాయపడే వీలుందని పేర్కొన్నారు. ఇక  టాస్క్ చివరిలో సందీప్ (Sandeep) కంటైనర్ లో నీళ్లు ఎక్కువగా ఉండడంతో సందీప్ విజేతగా నిలిచాడు.

Also Read: Bigg Boss 7: బిగ్ బాస్ హౌస్ నుండి షాకింగ్ వీడియోలు లీక్..!

publive-image

నేనే ఆడతాను..

బిగ్ బాస్ ఇచ్చిన నెక్స్ట్ టాస్క్ 'ఎంప్టీ ద బాస్కెట్' ఈ టాస్క్ లో ఎవరు ఆడాలి.. అనేది నిర్ణయించుకోమని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు తెలిపారు. దీంతో శోభ, అశ్విని, తేజ, గౌతమ్, యావర్, శివాజీ అందరూ మేము ఆడతామని తగిన కారణాలు చెప్పుకున్నారు. ఇక శోభ (Shobha) అయితే.. 'నేనే ఆడతాను, నేను ఎవ్వరినీ ఆడనివ్వను' అంటూ మొండిగా మాట్లాడింది.  ఎంత సేపటికీ వీళ్ళు నిర్ణయం తీసుకోలేదు. దీంతో బిగ్ బాస్.. కెప్టెన్ అర్జున్ ఎవరు ఆడాలో మీరు నిర్ణయించండి.. అని ఆదేశించారు. ఇక అర్జున్ .. శోభ, గౌతమ్, అశ్విని, శివాజీ ఆడతారని నిర్ణయించాడు. ఇక  ఈ టాస్క్ అందరికన్నా ముందుగా పూర్తి చేసి గౌతమ్ (Gautham) కంటెండర్ గా నిలిచాడు. దాని తర్వాత జరిగిన టాస్క్ లో శోభ మళ్ళీ ఆడి కంటెండర్ గా నిలిచింది.

publive-image

నన్ను అక్కా అని పిలవకు ప్రశాంత్.. 

రతిక (Rathika) మళ్ళీ ప్రశాంత్ తో మంచిగా ఉండడానికి ట్రై చేస్తుంది. దాని కోసం రతిక ప్రశాంత్ తో వెళ్లి మాట్లాడింది. కానీ ప్రశాంత్ రతిక చెప్పిన మాటలు ఏ మాత్రం వినలేదు.. అలాగే రతిక విషయంలో తాను ఎంతగా బాధపడ్డాడో చెప్పాడు. 'ఆ రోజు జరిగిన టాస్క్ లో నువ్వు మా అమ్మ, నాన్నను కూడా అన్నావు.. అది నేను మర్చిపోలేదు అంటూ ప్రశాంత్ ఏడ్చాడు. దానికి రతిక నేను ఆ ఇంటెన్షన్ తో అనలేదు.. ఇక నుంచి హౌజ్ లో ఉన్నంత వరకు ఫ్రెండ్లీ గా ఉందాము.. అలాగే నువ్వు నన్ను అక్క అని పిలవకు అని పేర్కొంది. దానికి ప్రశాంత్ (Pallavi Prashanth)  'నా ఆట నేను ఆడుకుంటా.. నా వల్ల ఏమైనా తప్పు జరిగితే క్షమించు అక్క.. అని రతికతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక శివాజీ వీళ్లిద్దరి మధ్య ప్యాచప్ చేయడానికి ట్రై చేశారు.

Also Read: మెగా వెడ్డింగ్‌ కార్డ్ వచ్చేసింది..మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

#bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-telugu-updates #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe