Bigg Boss 7 Telugu: లాగి మొహం పై కొట్టాడు.. రైతు బిడ్డ పై రెచ్చిపోయిన సందీప్. ..!

కెప్టెన్సీ టాస్క్ లో చివరి లెవెల్ కు చేరుకున్న తేజ, ప్రశాంత్, సందీప్, గౌతమ్ 'రంగు పడుద్ది రాజా' టాస్క్ ఆడతారు. ఆట చాలా ఉత్సాహంగా, ఆసక్తిగా జరుగుతుంది

New Update
Bigg Boss 7 Telugu:  లాగి మొహం పై కొట్టాడు.. రైతు బిడ్డ పై రెచ్చిపోయిన సందీప్. ..!

Bigg Boss 7 Captaincy: ఇప్పటి వరకు పవర్ అస్త్రా అనే థీమ్ (Power Astra Theme) తో నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో.. మొదటి కెప్టెన్సీ టాస్క్ (Captaincy Task) యుద్ధం నిన్నటితో ముగిసింది. కెప్టెన్సీ టాస్క్ లో చివరి లెవెల్ కు చేరుకున్న తేజ, ప్రశాంత్, సందీప్, గౌతమ్ 'రంగు పడుద్ది రాజా' టాస్క్ ఆడతారు. ఆట చాలా ఉత్సాహంగా, ఆసక్తిగా జరిగింది. మొత్తం 4 రౌండ్స్ లో ఈ ఆట జరుగుతుంది. ప్రతి రౌండ్లో టీషర్ట్ పై రంగు ఎక్కువగా ఒకరు ఉన్న వాళ్ళు ఆట నుంచి ఔట్ అయిపోతారు.

రైతు బిడ్డ పై రెచ్చిపోయిన సందీప్ 

నలుగురు టాస్క్ ఆడగా ఫస్ట్ తేజ సిర్కిల్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఔట్ అవుతాడు. ఇక నెక్స్ట్ సందీప్ (Sandeep), ప్రశాంత్ (Pallavi Prashanth), గౌతమ్ ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది.. పల్లవి ప్రశాంత్, సందీప్ ఇద్దరు చాలా కసిగా ఆడతారు. ప్రశాంత్ సందీప్ టీషర్ట్ పై గ్యాప్ లేకుండా రంగు పూస్తాడు. దాంతో సందీప్ రేస్ నుంచి బయటకు వెళ్తాడు. రేస్ నుంచి బయటకు వెళ్లిన సందీప్.. ప్రశాంత్ మొహం పై కొడుతున్నాడు.. అలా కొడితే గేమ్(game) ఎలా ఆడాలి అంటూ సంచాలక్ తో వాదిస్తాడు. మనిషివి కాదా నువ్వు అలా మొహం పై కొడతావా అంటూ ప్రశాంత్ పై ఫైర్ అవుతాడు. నేను అసలు కొట్టలేదని ప్రశాంత్ వాదిస్తాడు. ఇలాంటి ఫాల్తూ గేమ్ ఆడొద్దు అని కోపంతో రెచ్చిపోతాడు.

బలైన సందీప్.. 

సెకండ్ రౌండ్లో సందీప్, ప్రశాంత్, గౌతమ్ (Goutham) ఉంటారు.. ప్రశాంత్, గౌతమ్ ఇద్దరు కలిసి సందీప్ ని టార్గెట్ చేసినట్లుగా ఉంది. పక్కనే గౌతమ్ ఉన్నప్పటికీ ప్రశాంత్, గౌతమ్ పై రంగు పూయకుండా సందీప్ పై మాత్రమే ఫోకస్ పెడతాడు. ప్రశాంత్, గౌతమ్ ఇద్దరు కలిసి ఒకేసారి మీద పడటంతో సందీప్ షర్ట్ పై ఎక్కువ రంగు పడుతుంది.. ఇక అమర్ ఒక్క వ్యక్తిని ఇద్దరు కలిసి టార్గెట్ చేసారు ఇదీ ఒక గేమేనా అంటూ కోపంతో అరుస్తాడు.

గౌతమ్ VS ప్రశాంత్ 

సందీప్ టార్గెట్ చేసి బయటకు పంపాక, గౌతమ్, ప్రశాంత్ చివరి రౌండ్లో పోటీ పడతారు.. వీళ్లిద్దరి గేమ్ చాలా రసవత్తరంగా జరుగుంతుంది. ఇద్దరు ఒకరి పై ఒకరు పడి గట్టిగానే ఆడతారు. ప్రశాంత్ కు దెబ్బ కూడా తాకింది.. టాస్క్ లో ఇద్దరు ఒకేసారి సర్కిల్ నుంచి బయటకు వెళ్తారు దాంతో ప్రియాంక ఇద్దరినీ హెచ్చరిస్తుంది. ఇద్దరు చొక్కాలు చిరిగేలా ఆడతారు కానీ చివరికి ప్రశాంత్ షర్ట్ పై కంటే గౌతమ్ షర్ట్ పై కాస్త ఎక్కువ రంగు ఉండటంతో సంచాలకులైన ప్రియాంక ప్రశాంత్ ను బిగ్ బాస్ ఇంటి మొదటి కెప్టెన్ గా ప్రకటిస్తుంది.

ఇంటి మొదటి  రైతు బిడ్డ

ఇంటి మొదటి కెప్టెన్ అయినందున  ప్రశాంత్ చాలా ఆనందంగా ఉంటాడు.. వేటాడావు రా బిడ్డ అంటూ శివాజీ(Sivaji) ప్రశాంత్ ని అభినందిస్తాడు.. నువ్వు గెలిస్తే ఆనందంగా నాకు ఆనందగా ఉందని సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు.

Also Read: Bigg Boss 7 Promo: నన్ను కొడితే.. తాట తీస్తా..! ఎవరికి రంగు పడింది..?

Advertisment
తాజా కథనాలు