Sajjala: సజ్జలకు బిగ్ షాక్.. సీఐడీకి ఫిర్యాదు!

AP: క్వార్జ్‌ అక్రమాల్లో సజ్జల, ఆయన అనుచరుల పాత్రపై సీఐడీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు సైదాపురం గనుల యజమాని బద్రీనాథ్‌. తమ పొలాల్లోని గనుల్లో లక్షల టన్నుల క్వార్జ్‌ను మార్కెట్‌లో అక్రమంగా అమ్మారని.. దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Sajjala: సజ్జలకు బిగ్ షాక్.. సీఐడీకి ఫిర్యాదు!
New Update

Sajjala Ramakrishna Reddy: క్వార్జ్‌ అక్రమాల్లో సజ్జల, ఆయన అనుచరుల పాత్రపై సీఐడీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు సైదాపురం గనుల యజమాని బద్రీనాథ్‌. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే గనులు దోచేశారని అన్నారు. శ్రీకాంత్‌ రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి దౌర్జన్యం చేశారని పేర్కొన్నారు. అదూరు శ్రీచరణ్‌, కృష్ణయ్యను అడ్డుపెట్టుకుని అక్రమాలు చేసినట్లు ఆరోపించారు. బద్రీనాథ్‌ మాట్లాడుతూ.." సైదాపురం మండలం జోగుపల్లిలో మాకు 240 ఎకరాలు ఉంది. 240 ఎకరాల్లో మాకు 8 గనులున్నాయి. రెండేళ్లుగా మా పొలాల్లోని గనులను అక్రమంగా దోచేశారు. 500 నుంచి 800 కోట్ల టన్నులు తవ్వేసి రూ. వేల కోట్లు దోచేశారు. లక్షల టన్నుల క్వార్జ్‌ను మార్కెట్‌లో అక్రమంగా అమ్మారు. గనుల అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించారు." అని అన్నారు.

#sajjala
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe