నిన్నమొన్నటివరకు డల్గా ఉన్న కమల కార్యకర్తల్లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. అసలు చేరికలే లేక సతమతమవుతున్న బీజేపీలోకి వలసలు పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీలోకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చేరనుండడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కమలం గూటికి చేరనున్నారు. ఈ ఇద్దరు నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇటివలే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్రెడ్డితో భేటీ అయిన సంజీవరావు, శ్రీదేవి..సోమవారం కమల కండువా కప్పుకొనున్నారు. మరోవైపు ఇవాళ మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ లు లక్ష్మా రెడ్డి బీజేపీలో చేరనున్నారు. బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇప్పటికే ఢిల్లీలో ఉండగా.. మధ్యాహ్నం హస్తినకు చేరుకోనున్నారు ఈటల రాజేందర్. ఆధ్వర్యంలో చేరికలు ఉన్నట్టు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..కాంగ్రెస్కు షాక్.. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్.. ఎవరంటే..?
ఇటివలే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్రెడ్డి దూకుడు కనబరుస్తున్నారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఇవాళ(జులై 29) బీజేపీలో చేరనున్నారు. ఈ ఇద్దరు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు కావడంతో హస్తం పార్టీకి గట్టి షాక్ తగిలినట్టైంది.
Translate this News: