Bigg Boss 7: కెప్టెన్సీ టాస్క్ యుద్ధం.. సంచాలకులకు చుక్కలు కనిపించాయి..!

పవర్ అస్త్రా థీమ్ తో నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో మొట్ట మొదటి సారీ ఇంటి సభ్యులు కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడుతున్నారు. కెప్టెన్ అయిన వాళ్ళకి బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. అంతా

New Update
Bigg Boss 7: కెప్టెన్సీ టాస్క్ యుద్ధం.. సంచాలకులకు  చుక్కలు కనిపించాయి..!

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 గత అన్ని సీజన్స్ తో పోల్చుకుంటే కాస్త వినూత్నంగానే సాగుతుంది. బిగ్ బాస్(Bigg Boss) ఆటలో ఇంటి సభ్యులకు(House Mates) ప్రతి రోజు ఎదో ఒక ట్విస్ట్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆటను ముందుకు తీసుకెళ్తున్నారు.

ఈ పవర్ అస్త్రా (Power Astra) అనే థీమ్ తో మొదలైన ఆట మళ్ళి ఒక కొత్త మలుపు తిరిగింది. ఇదివరకు బిగ్ బాస్ పవర్ అస్రాను గెలిచిన సభ్యులు మాత్రమే కంఫర్మ్డ్ హౌస్ మెట్ ఉండే అర్హత ఉంటుందనే మెలిక పెట్టారు. అయితే పవర్ అస్త్రాను సొంతం చేసుకున్న సభ్యులుగా సందీప్ (Sandeep), శివాజీ (Sivaji), శోభ, ప్రశాంత్ (Pallavi Prashanth) నిలిచారు.

పవర్ అస్త్రాకు వీడ్కోలు.

నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు పెద్ద ట్విస్టే ఇచ్చారు. ఇప్పటివరకు పవర్ అస్త్రాను గెలుచుకున్న సందీప్, శోభా, ప్రశాంత్ దాన్ని తిరిగి బిగ్ బాస్ కు ఇచ్చేయాలని చెప్పారు. దాంతో పవర్ అస్త్రా గెలుచుకున్న సభ్యలు ఒక్కసారిగి షాక్ అయ్యారు. అంతే కాదు ఎంతో హుందాగా పవర్ అస్త్రాకు వీడ్కోలు యాత్ర కూడా ప్లాన్ చేసారు బిగ్ బాస్.

పాపం రైతు బిడ్డ ప్రశాంత్

బిగ్ బాస్ ట్విస్ట్ రైతు బిడ్డ ప్రశాంత్ కు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. పవర్ అస్త్రా గెలిచిన సందీప్, శోభా, శివాజీ, దాని వల్ల కనీసం ఒక్క రెండు వారాలైనా సేఫ్ జోన్ లో ఉన్నారు కానీ ప్రశాంత్ దాన్ని కష్టపడి గెలుచుకున్న లాభం లేకుండా పోయింది.

జంటలుగా విడిపోయిన సభ్యులు.

ఇక ఇప్పటి నుంచి ఆట వేగం అందుకుంటోంది బిగ్ బాస్ సీజన్ 7 లో మొట్ట మొదటి కెప్టెన్సీ టాస్క్ జరగబోతుంది అంటూ హౌస్ మేట్స్ కు మళ్లీ  కొత్త ట్విస్ట్ ఇస్తాడు బిగ్ బాస్. ఈ ఇంట్లో మీ బెస్ట్ బడ్డీ(buddy) ఎవరో నిర్ణయించుకొని ఇంటి సభ్యులు అంతా జంటలుగా విడిపోండి అని బిగ్ బాస్ ఆదేశిస్తారు. మీరు ఎంచుకునే నీ బడ్డీ పైనే నీ గేమ్ ఆధారపడి ఉంటుందని హెచ్చరించారు. శుభ-గౌతమ్, శోభా-ప్రియాంక, అమర్-సందీప్, ప్రశాంత్-శివాజీ, యావర్-తేజ జంటలుగా విడిపోతారు.

గందగోళంగా కెప్టెన్సీ (captaincy) టాస్క్

జంటలుగా విడిపోయిన సభ్యులకు బిగ్ బాస్ 'మీ నవ్వే మిమల్ని గెలిపిస్తుంది' అనే టాస్క్ ఇస్తాడు. కానీ దీంట్లో ఒక మెలిక ఉంది అంటూ మీరు ఈ స్మైలీ బొమ్మలను సెట్ చేయాలంటే ఇక్కడ ఉన్న స్లైమ్ ఇంకా ఫెదర్స్ ను దాటి పిట్ లో ఉన్న మీ స్మైలీ నంబర్స్ ను తెచ్చుకోవాల్సి ఉంటుంది అని చెప్తారు. ఒక్కొక జంట టాస్క్ ను బీభత్సంగా ఆడతారు.

కానీ ఇందులో వింత ఏంటంటే టాస్క్ (Task) లో ఎవ్వరూ బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవ్వలేదు అందరు ఫౌల్ చేసారు. ఇక టాస్క్ లో విన్నర్ ఎవరో డిసైడ్ చేయడానికి సంచాలకులకు చుక్కలు కనిపించాయి.సంచలకులైన యావర్, శోభా తో తామే ముందుగా పెట్టమంటూ అమర్, సందీప్ వాదించారు. ఇటు శివాజీ అయితే కోపంతో ఏకంగా టేబుల్ నే తన్నేసారు.
మధ్యలో అమర్ (Amar), శుభ కి గొడవ జరుగుతుంది అమర్ శోభ గట్టి గట్టిగా అరిచేసుకుంటారు. ఇక శోభా అయితే సంచాలకులుగా మేము నిర్ణయిస్తాం ఎవ్వరు మాకు చెప్పకండి అంటూ కోపంతో అరిచేస్తుంది.

Also Read: Chiranjeevi Next Movie: ఆ సంచలన సినిమా సీక్వెల్ కు చిరు ప్లాన్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Advertisment
తాజా కథనాలు