BhavyaSri: మిస్టరీగా భవ్యశ్రీ మృతి.. చంపింది ఆ ముగ్గురేనా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదెరు?

భవ్యశ్రీని గ్యాంగ్ రేప్ చేసి చంపేశారని ఆరోపించారు మృతురాలి తండ్రి. తన కూతురుని కిరాతకంగా చంపేసిన ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు భవ్య శ్రీ తండ్రి. ఈత వచ్చిన భవ్యశ్రీ బావిలో పడి ఎలా చనిపోతుందని ప్రశ్నించారు ఆమె తల్లి. ఈ ప్రశ్నలే ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

New Update
BhavyaSri: మిస్టరీగా భవ్యశ్రీ మృతి.. చంపింది ఆ ముగ్గురేనా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదెరు?

Bhavya Sri Death Mystery: భవ్యశ్రీని గ్యాంగ్ రేప్ చేసి చంపేశారని ఆరోపించారు మృతురాలి తండ్రి. తన కూతురుని కిరాతకంగా చంపేసిన ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు భవ్య శ్రీ తండ్రి. ఈత వచ్చిన భవ్యశ్రీ బావిలో పడి ఎలా చనిపోతుందని ప్రశ్నించారు ఆమె తల్లి. ఈ ప్రశ్నలే ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. భవ్యశ్రీని ముందుగా చెట్టుకు ఉరేసి. ఆ పై బావిలో పడేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. కుమార్, బాలు హేమంత్ ఎవరు? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ముగ్గురుని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు, బంధుమిత్రులు.

అయితే, భవ్యశ్రీకి నలుగురు అబ్బాయిలు ప్రపోజ్ చేయగా.. వారికి నో చెప్పిందని ఒక ప్రచారం జరుగుతోంది. వారే ఇంతటి కిరాతకానికి పాల్పడినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. తమను కాదన్నందుకు ఆగ్రహంతోనే.. పక్కా ప్లాన్ ప్రకారం భవ్య శ్రీని కిడ్నాప్ చేసి, ఇంతటి దారుణానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. భవ్యశ్రీ పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ.. ఏం జరిగింది అనేది తెలియని పరిస్థితి ఉంది.

కావూరివారిపల్లె పంచాయతీ, ఠాణా వేణుగోపాలపురంకి చెందిన భవ్యశ్రీ ఈనెల 17వ తేది రాత్రి అదృశ్యమైంది. 18వ తేదీ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 20వ తేదీన గ్రామంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా చెరువులో భవ్యశ్రీ శవమై కనిపించింది. బాలిక మృతదేహం చూసిన కొందరు యువకులు కేకలు వేస్తూ గ్రామస్తులకు విషయం చెప్పారు. దీంతో అందరూ బావి దగ్గరకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి బావిలోని విద్యార్థిని డెడ్ బాడీని బయటకు తీశారు. ఆ మృతదేహం భవ్యశ్రీదిగా గుర్తించారు. కుమార్తె చనిపోయిందని తెలిసి.. భవ్యశ్రీ కుటుంబసభ్యులు శోకసంద్రంలో‌ మునిగిపోయారు‌. ఆమెకు అర్థ శిరోముండనం చేసి, కనురెప్పలు కత్తిరించి ఉరివేసి చంపేసిన తర్వాత బావిలో పడేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.

కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని వడ్డెర సంఘలం నాయకులతో పాటు బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం మూడ్రోజులుగా నీటిలోనే ఉన్నందున జుట్టు ఊడిపోయిందని, ప్రాథమికంగా ఎలాంటి గాయాలు లేవని వచ్చిందని చెబుతున్నారు పోలీసులు. అయితే గ్రామస్తులు, కుటుంబసభ్యులు మాత్రం ఆ వాదనను అంగీకరించలేదు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. అనుమానితులను వేంటనే అదుపులోకి తీసుకుని విచారణ జరపాలని డీఎస్పీ ఆదేశించడంతో వడ్డెర సంఘం నాయకులు శాంతించారు. భవ్యశ్రీ మృతిదేహం లభించిన బావి వద్దకు వెళ్లి.. సంఘటనాస్థలిని పరిశించారు చిత్తూరు డీఎస్పీ. నలుగురు యువకులపై అనుమానం ఉందని చెప్పడంతో.. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అఘాయిత్యం జరిగిందా..? విషప్రయోగం జరిగిందా..? అనే దానిపై పరీక్షించేందుకు శాంపిల్స్‌ను తిరుపతి RFSLల్యాబ్‌కు పంపామని పోలీసులు తెలిపారు. ఆ నివేదికలు వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇందుకోసమే చంపేశారా?

Also Read:

Chandrababu: చంద్రబాబుకు దొరకని రిలీఫ్.. రేపు మెన్షన్ చేయాలన్న సుప్రీం ధర్మాసనం..

india-canada: భారత్ తో సంబంధం మాకు చాలా ముఖ్యమైనది-కెనడా రక్షణ మంత్రి

Advertisment
తాజా కథనాలు