పశ్చిమ బెంగాల్లో పంచాయితీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత జిల్లా సమితి, జిల్లా పరిషత్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జూలై 8న జరిగిన ఎన్నికల్లో హింస, బూత్ కబ్జాలు, ఓటరు బెదిరింపులకు సంబంధించిన అనేక హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో అనేక మంది అరెస్టుల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను మమతా బెనర్జీ ప్రభుత్వానికి ప్రజాదరణ పరీక్షగా భావిస్తున్నారు. జూలై 8న పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..నేడు బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు..!!
పశ్చిమ బెంగాల్ పంచాయితీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8గంటలకు ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జూలై 8న జరిగిన పోలింగ్లో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. సాయంత్రంలోగా ఈ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
Translate this News: