బీజేపీని ఓడించడమే లక్ష్యంగా దేశంలోని అన్ని పార్టీలు ఏకం అవుతున్నాయి. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్ విపక్షాలను ఏకం చేసే పనిలో భాగంగా పలు పార్టీలతో సమావేశమయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకులతో నితిష్ భేటీ కొనసాగింది. తాజాగా బెంగాల్ సీఎం ఒక అడుగువేశారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ యాదవ్ను కలవడానికి గురువారం ఆమె పాట్నాకు చేరుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నివాసంలో లాలూతో భేటీ అయ్యారు. లాలూ పాదాలకు నమస్కరించారు మమత. ఆ సమయంలో మమతతోపాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నారు. ఈ సమావేశంలో లాలూ ఆరోగ్యంపై మమతా ఆరా తీశారు. ఇద్దరూ నవ్వుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. మమతకు శాలువా కప్పి సత్కరించారు లాలూప్రసాద్ యాదవ్.
పూర్తిగా చదవండి..లాలూ కాళ్లు మొక్కిన మమత..రేపు పాట్నాలో విపక్షాల సమావేశంపై చర్చ..!!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విపక్షాల సమావేశానికి ముందు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ యాదవ్ను కలవడానికి గురువారం పాట్నా చేరుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నివాసంలో లాలూతో భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ అత్యంత కీలకంగా మారింది. లాలూను కలుసుకున్న మమతా ఆయన పాదాలకు నమస్కరించారు. అనంతరం ఆరోగ్యంపై ఆరా తీశారు. దేశాన్ని విపత్తు నుంచి కాపాడాలంటే వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ ఓడించాలని దీదీ అన్నారు.
Translate this News: