క్రికెట్ ఫ్యాన్స్కి ఈ ఏడాది ఐపీఎల్(IPL) చెరిగిపోని జ్ఞాపకాలను అందించింది. ముఖ్యంగా రెండే రెండు విషయాలు అందరి మనసుల్లో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి. అందులో ఒకటి ధోనీ(dhoni) ఐపీఎల్ కప్ సాధించడంరెండోది కోహ్లీ-గంభీర్(kohli-gambhir) కాంట్రవర్శీ. ఇప్పటివరకు ఐపీఎల్లో ఎన్నో సార్లు ప్లేయర్ల మధ్య గొడవలు జరిగినా.. చెంప దెబ్బలు తగిలించుకున్నా.. బ్యాట్లు విసిరినా.. అన్నిటిలోనూ ఎక్కువగా ట్రెండింగ్ అయ్యింది కోహ్లీ-గంభీర్ ఇష్యూనే. ఈ ఏడాది లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో కోహ్లీ, గంభీర్ కొట్టుకున్నాంత పని చేశారు. ఈ ఘటనపై కపిల్ దేవ్(kapil dev) తాజాగా స్పందించారు.
పూర్తిగా చదవండి..పొగరు, అహం.. కోహ్లీ, గంభీర్ ఫైట్ ఇష్యూపై లెజండరీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
ఈ ఏడాది ఐపీఎల్లో జరిగిన కోహ్లీ వర్సెస్ గంభీర్ ఇష్యూ తనను ఎంతగానో బాధించిందన్నారు కపిల్ దేవ్. ఆటగాళ్లను బీసీసీఐ గొప్పగా తీర్చిదిద్దితే సరిపోదని.. మంచిగా కూడా తయారు చేయాలన్నారు ఈ మాజీ లెజండ్. అటు యంగ్ క్రికెటర్లపైనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీనియర్లను సలహా అడిగేందకు వాళ్లకి అహం అడ్డొస్తోందంటూ విమర్శలు గుప్పించారు.
Translate this News: