ఏసీఏ పైలాన్లను ఆవిష్కరించిన బీసీసీఐ ప్రెసిడెంట్....!

ఏసీఏ చేస్తున్న అభివృద్ధి పనులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అన్నారు. విశాఖ జిల్లా పీఎం పాలెంలోని ఏ.సీ.ఏ - వీ.డీ.సీ.ఏ స్టేడియంలో ఏ.సి.ఏ ఫైలాన్లను బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ప్రారంభించారు. ఆయనతో పాటు మాజీ క్రికెటర్ మదన్ లాల్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఏ.సీ.ఏ సెక్రటరీ గోపినాధ్ రెడ్డి పాల్గొన్నారు.

author-image
By G Ramu
ఏసీఏ పైలాన్లను ఆవిష్కరించిన బీసీసీఐ ప్రెసిడెంట్....!
New Update

ఏసీఏ చేస్తున్న అభివృద్ధి పనులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అన్నారు. విశాఖ జిల్లా పీఎం పాలెంలోని ఏ.సీ.ఏ - వీ.డీ.సీ.ఏ స్టేడియంలో ఏ.సి.ఏ ఫైలాన్లను బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ప్రారంభించారు. ఆయనతో పాటు మాజీ క్రికెటర్ మదన్ లాల్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఏ.సీ.ఏ సెక్రటరీ గోపినాధ్ రెడ్డి పాల్గొన్నారు.

పైలాన్లను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. అండర్-19కు ప్రతిభావంతులైన క్రీడాకారులను ఏసీఏ అందించిందని చెప్పారు. విశాఖ లో మంచి గ్రౌండ్స్ ఉన్నాయని వెల్లడించారు. అలాగే రానున్న పది సంవత్సరాలలో ఏపీలో క్రికెట్ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇది ఇలా వుంటే తన నియోజకవర్గానికి అతిథులు రావడం తనకు చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అన్నారు.

70 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఏ.సీ.ఏ కార్యవర్గ సభ్యులుకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. అనంతరం బుడి ముత్యాల నాయుడు మాట్లడుతూ... నేటికీ ఏసీఏ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉందన్నారు. 1983 వరల్డ్ కప్‌లో ఆడిన క్రీడాకారులు ఈ సందర్భంగా విశాఖ కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఏ.సీ.ఏ ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సభ్యులను మదన్ లాల్ అభినందించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మరి కొంత మంది క్రీడాకారులను అందించాలని ఆయన కోరారు. గడిచిన 70 ఏండ్లలో ఏ.సీ.ఏ ఎన్నో విజయాలు సాధించిందని ఏ.సి.ఏ సెక్రటరీ గోపినాధ్ రెడ్డి అన్నారు. బీసీసీఐ పెద్దలు విశాఖకు రావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.

#bcci #pylon #avanthi-srinivas #madhan-lal #roger-binny
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe