• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • నిజామాబాద్
  • విజయవాడ
  • వైజాగ్
Home » ఫైర్ బ్రాండ్ బండి సంజయ్‌కు ప్రమోషన్

ఫైర్ బ్రాండ్ బండి సంజయ్‌కు ప్రమోషన్

Published on July 29, 2023 12:47 pm by BalaMurali Krishna

తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు అధిష్టానం ప్రమోషన్ ఇచ్చింది. కీలకమైన జాతీయ కార్యవర్గంలో చోటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు సీనియర్ నాయకురాలు డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.

Translate this News:

జాతీయ కార్యవర్గంలో చోటు..

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌(Bandi Sanjay)కు ప్రమోషన్ లభించింది. జాతీయ కార్యవర్గాన్ని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు చోటు దక్కింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను అలాగే కొనసాగించారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, ఏపీ నుంచి సత్యకుమార్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బీఎల్‌ సంతోష్, సంస్థాగ వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా శివప్రకాశ్‌ను కొనసాగించనున్నట్లు తెలిపారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ రాజీనామా చేసినప్పటి నుంచి ఆయనకు కేంద్ర మంత్రి పదవి లేదా జాతీయ స్థాయి పదవి ఇస్తారని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కొన్ని రాష్ట్రాలకు ఇంచార్జ్‌గా పంపించే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ తాజాగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.

బండి నాయకత్వంలో ఫుల్ జోష్..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి రాష్ట్రంలో పార్టీకి మంచి మైలేజ్ తీసుకువచ్చారు బండి సంజయ్(Bandi Sanjay ). తనదైన దూకుడు శైలితో సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ నేతలపై వాడివేడి విమర్శలు చేస్తూ క్యాడర్‌లో జోష్ తీసుకువచ్చారు. ఆయన నాయకత్వంలోనే దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. అలాగే రాష్ట్రానికి ఆయువుపట్టు అయిన గ్రేటర్ హైదరాబాద్‌లోనూ సత్తా చాటారు. 2021లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా 48స్థానాలు గెలిచి బీఆర్‌ఎస్ పార్టీకి బీజేపీతోనే ప్రధాన పోటీ అని నిరూపించారు. సంజయ్ నాయకత్వంలో బీజేపీ బలంగా పుంజుకుందనడంలో ఇవి సాక్ష్యాలుగా నిలిచాయి.

ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు..

సంజయ్ నాయకత్వంలోనే ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి వంటి వారు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి రానుందని జనాల్లోకి బలంగా తీసుకువెళ్లారు. అయితే ఇతర పార్టీల నేతలు సంజయ్ ఒంటెద్దు పోకడతో ఇమడలేకపోయారు. సీఎం కేసీఆర్‌పై ఘాటైన విమర్శలు చేయడం, కల్వకుంట్ల కుటుంబం జైలుకి వెళ్లడం ఖాయమంటూ కౌంటర్లు ఇస్తూ మైలేజ్ తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే పార్టీలో ఉన్న ఓ వర్గం నేతలకు సంజయ్ దూకుడు రుచించలేదు. దీంతో ఈటల, రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు కూడా ట్రై చేశారు. మరోవైపు ఢిల్లీ వెళ్లి సంజయ్ నాయకత్వంపై ఫిర్యాదులు కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. పరిస్థితి చేయి దాటడంతో అధిష్టానం వారిని బుజ్జగించి మార్పులకు శ్రీకారం చుట్టింది.

ఇకనుంచైనా మానుకోవాలి..

దాంతో అనూహ్యంగా సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతల నుంచి తొలగించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే చాలా మంది కరుడుకట్టిన కమలం నేతలకు ఇది మింగుడుపడలేదు. కానీ అధిష్టానం పెద్దల మాట కాదనలేక మౌనంగా ఉండిపోయారు. కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా బండి సంజయ్ చేసిన కామెంట్స్ కూడా ఇందుకు బలం చేకూర్చాయి. కొంతమంది నేతలు ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం ఇకనుంచైనా మానుకోవాలని సూచించారు. సీనియర్ నాయకుడైన కిషన్ రెడ్డి స్వేచ్ఛగా పనిచేసేందుకు సహకరించాలని హితవు పలికారు. ఈ పరిణామాల నేపథ్యంలో బండికి జాతీయ కార్యదర్శిగా ప్రమోషన్ ఇస్తూ అధిష్టానం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.

 

Primary Sidebar

INDvsAUS: రెండో వన్డేలో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్.. 2-0తో సిరీస్ కైవసం

INDvsAUS: రెండో వన్డేలో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్.. 2-0తో సిరీస్ కైవసం

Rajaiah: మరో బాంబ్ పేల్చిన రాజయ్య.. కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు

Rajaiah: మరో బాంబ్ పేల్చిన రాజయ్య.. కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు

Chandrababu: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

Chandrababu: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

Chandrababu: బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం వెనక రాజకీయ కారణం ఉందా..?

Chandrababu: బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం వెనక రాజకీయ కారణం ఉందా..?

IND vs AUS :  వర్షం కారణంగా  మ్యాచ్‎కు అంతరాయం...నిలిచిపోయిన ఆట..!!

IND vs AUS : వర్షం కారణంగా మ్యాచ్‎కు అంతరాయం…నిలిచిపోయిన ఆట..!!

PM Modi Mann ki Baat : చంద్రయాన్-3, జీ-20తో ప్రపంచం భారత్ వైపు చూస్తోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!!

PM Modi Mann ki Baat : చంద్రయాన్-3, జీ-20తో ప్రపంచం భారత్ వైపు చూస్తోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!!

VandeBharat Express : తెలుగు రాష్ట్రాలకు మోదీ కానుక..ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని..!!

VandeBharat Express : తెలుగు రాష్ట్రాలకు మోదీ కానుక..ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని..!!

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న డీజిల్, పెట్రోల్ ధరలు..!!

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న డీజిల్, పెట్రోల్ ధరలు..!!

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online