Babu Mohan: కేఏ పాల్ పోటీ అక్కడి నుంచే: బాబు మోహన్ కేఏ పాల్ విశాఖ లోక్ సభ స్థానం నుంచి బరిలో నిలుస్తారని ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్ వెల్లడించారు. కేఏ పాల్కు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. By Jyoshna Sappogula 13 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Babu Mohan: సినీ కమెడియన్, మాజీ మంత్రి బాబు మోహన్.. కేఏ పాల్ నేతృత్వంలో ప్రజాశాంతి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటివల తెలంగాణ ఎన్నికల తర్వాత .. బీజేపీపై, బీజేపీ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించి బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బాబు మోహన్ వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీలో ఉండనున్నట్లు తెలుస్తోంది. Also Read: పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన పెళ్లి కొడుకు.. ఇంతలోనే..! తాజాగా, కేఏ పాల్ పోటీపై బాబు మోహన్ స్పందించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ అధినేత కేఏ పాల్ విశాఖ లోక్ సభ స్థానం నుంచి బరిలో నిలుస్తారని క్లారిటీ ఇచ్చారు. ఆయనకు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని బాబు మోహన్ స్పష్టం చేశారు. ఇతర దేశాల నుండి ఆదాయం తేగలిగే సామర్థ్యం కేఏ పాల్ కు ఉందన్నారు. బీజేపీ చేసిన మోసానికి తాను రాజకీయాల్లో ఉండదలచుకోలేదని.. బీజేపీ ద్రోహం చేసిందని, మోసం చేసింది ఆరోపించారు. కె పాల్ లాంటి మంచి వ్యక్తిని గెలిపించాలని కోరారు. #ka-paul #babu-mohan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి