ప్రముఖ య్యూటబర్ రూబీ ఫ్రాంక్కు 60ఏళ్ల జైలు శిక్ష పడింది. తన ఆరుగురి పిల్లలకు తిండి, నీరు, నిద్ర లేకుండా రూబీ హింస పెట్టినట్టు విచారణలో తేలింది. కేసు తీర్పు సమయంలో రూబీ ఏడుపు ఆపుకోలేకపోయింది. తన తప్పులకు పశ్చాత్తాపపడింది. పిల్లలకు క్షమాపణలు చెప్పింది.

Trinath
ఫ్లోరిడాలో ఓ వ్యక్తి ముక్కులో 150 పురుగులు కాపురం పెట్టేశాయి. రక్తస్రావం అవుతోందని ఆ వ్యక్తి ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడి ENT వైద్యుడు అతని ముక్కు లోపల పరీక్షించి చూసి షాక్ అయ్యాడు. బాధితుడి ముక్కు క్లియర్ చేయడానికి ప్రత్యేకమైన యాంటీ పారాసైట్ లిక్విడ్ ఇచ్చారు.
ఐదేళ్ల నుంచి ఓ 70ఏళ్ల బామ్మ తన తమ్ముడి మృతదేహంతో కలిసి నిద్రపోతుంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని జీలాంగ్లో జరిగింది. మృతదేహం అస్థిపంజరంగా మారి కంపు కొడుతున్నా.. ఇంట్లోనే ఎలుకలు తిరుగుతున్నా ఆమె మాత్రం అక్కడే నివసించింది. ఈ వార్తపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎస్సీ చెందిన వెబ్సైట్ యూఆర్ఎల్ను మార్చుతున్నట్లు ప్రకటించింది. లింక్ పేరు మార్పును అభ్యర్థులు గమనించాలని కమిషన్ కోరింది. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు కీలక అప్డేట్ ఇచ్చింది. అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం 3వేల పోస్టులకు రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. దరఖాస్తు ఫారమ్ను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 6.
AAI Jobs : 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భర్తీ చేయనుంది. ఏప్రిల్ 2 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫారమ్ను సమర్పించడానికి చివరి తేదీ మే 1. దరఖాస్తు రుసుము రూ. 300. అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలకు మించకూడదు.
ఐపీఎల్ 17వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడనుంది. ఈ మ్యాచ్ మార్చి 22న ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఆర్సీబీతో ధోనీ టీమ్ తలపడనుంది.
రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ఆడకుండా తప్పించుకునేందుకు తనకు వెన్ను నొప్పి ఉందని అయ్యర్ అబద్ధం చెప్పాడని ఎన్సీఏ అధికారులు బీసీసీఐకి రిపోర్ట్ చేశారు. దీంతో అయ్యర్పై బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హ్యాపీగా ఐపీఎల్ ఆడుకోవచ్చని అయ్యర్ ప్లాన్ చేసినట్టు సమాచారం.
ఐపీఎల్ ప్రారంభానికి నెల రోజుల ముందే గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ ఐపీఎల్ ఆడే అవకాశం లేదు. అతని గాయానికి శస్త్రచికిత్స అవసరమని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. గతేడాది వన్డే వరల్డ్కప్ ఫైనల్ తర్వాత షమీ గ్రౌండ్లోకి దిగలేదు.