తెలంగాణలో లాసెట్ పరీక్షలకు దరఖాస్తుల గడువును పొడిగించారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15తో దరఖాస్తుల గడువు ముగిసింది. మరో 10 రోజుల పాటు గడువు పొడిగించారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అభ్యర్థులు ఏప్రిల్ 25 వరకు అప్లయ్ చేసుకోవచ్చని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మీ పేర్కొన్నారు.

Bhoomi
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తప్పక కొనుగోలు చేస్తామన్నారు. గాంధీ భవన్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచామన్నారు.
మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే చిలుమూల మదన్ రెడ్డి, గజ్వేల్ నేత ఎలక్షన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. మదన్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు.చిలుమూల మదన్ రెడ్డి నర్సాపూర్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
అమెజాన్లో మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్లో, అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డీల్స్, డిస్కౌంట్లు అందిస్తోంది. విక్రయ సమయంలో ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
TS Inter Results 2024: ఏప్రిల్ 22వ తేదీ తర్వాత ఏ క్షణమైనా తెలంగాణ ఇంటర్మడియెట్ రిజల్ట్స్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
ప్రతి వ్యక్తి ఎక్కువ కాలం జీవించాలనుకుంటాడు. దీర్ఘాయువు కోసం ప్రతిదీ చేస్తాడు. అయితే ప్రతివ్యక్తి కొన్ని చెడు అలవాట్లను కలిగి ఉంటాడు. అవి అతని జీవితానికి శత్రువుగా మారుతాయి. ఈ అలవాట్లు మనిషిని మృత్యువు అంచుకు తీసుకెళ్తాయి. ఈ అలవాట్లేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్విటర్ లో పోస్టు చేశారు.తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఖండించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాళ్ల దాడిని వైసీపీ నేతలతోపాటు , తెలంగాణ నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. విజయవాడలో సీఎం జగన్ పై రాళ్లదాడిని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేస్తూ తీవ్రంగా ఖండించారు. జాగ్రత్తగా ఉండాలి జగన్ అన్న..అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ పై దాడి జరగడం బాధకరమన్నారు. జగన్ ఎడమ కంటిపై గాయం కావాటం దురదృష్టకరమన్నారు వైఎస్ షర్మిల.
ఏపీ ఇంటర్ ఫలితాల్లో కర్నూలు జిల్లాకు చెందిన నిర్మల అనే విద్యార్థిని అత్యధిక మార్కులతో రాణించింది. కేజీబీవీలో చదువుతున్న నిర్మల ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 440 మార్కులకు గాను 421 మార్కులు సాధించింది. బాల్య వివాహాన్ని ఎదిరించి..ఇంటర్ టాపర్ గా నిలిచిన నిర్మల సక్సెస్ స్టోరీ మనందరం చదవాల్సిందే.