Hyderabad:హైదరాబాద్ లో దారుణం..మూగ, చెవిటి మహిళ పై అత్యాచారం!

హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మానవ మృగం చెవిటి, మూగ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మోహిదీపట్నంలోని విజయ్ నగర్ కాలనీలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

Hyderabad:హైదరాబాద్ లో దారుణం..మూగ, చెవిటి మహిళ పై అత్యాచారం!
New Update

Hyderabad:హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మానవ మృగం చెవిటి, మూగ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మోహిదీపట్నంలోని విజయ్ నగర్ కాలనీలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయి అనే కామాంధుడు ఆ మూగ మహిళను బలవంతంగా బాత్ రూమ్ లో బంధించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

తరువాత బాత్ రూమ్ కు బయటి నుంచి గడి పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. చాలా సేపు తరువాత గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను బాత్ నుంచి బయటికి తీశారు. తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సాయిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

అయితే ఈ దుర్మార్గుడు ఆమె మూగ ఇంకా చెవిటిది కావడంతో.. దీన్నే అదునుగా చేసుకొని పలుమార్లు ఆమె అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఇక అత్యాచారానికి గురైన బాధిత మహిళ భర్త కూడా మూగ వాడే కావడంతో దుర్మార్గుడు రెచ్చిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.

చట్టాలు కఠినంగా ఉన్నా..!

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల విషయంలో చట్టాలు రోజురోజుకి ఎంత కఠినంగా మారుతున్న కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై ఈ మానవ మృగాలు తెగబడుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్లను సైతం వదిలి పెట్టడం లేదు. అయితే కొన్ని రోజుల నుంచి తెలంగాణలో అత్యాచార ఘటనలు పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. మరో వైపు అత్యాచారానికి పాల్పడివారికి ఉరి శిక్ష విధించాల్సిందేనన్న వాదన దేశవ్యాప్తంగా బలపడుతోంది.

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe