• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • నిజామాబాద్
  • విజయవాడ
  • వైజాగ్
Home » అదంతా మీడియా ప్రచారం…రాహుల్ మణిపూర్ పర్యటనపై అసోం సీఎం సీరియస్..!!

అదంతా మీడియా ప్రచారం…రాహుల్ మణిపూర్ పర్యటనపై అసోం సీఎం సీరియస్..!!

Published on June 30, 2023 11:18 am by Bhoomi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సీరియస్ అయ్యారు. రాహుల్ పర్యటన గురించి మీడియా ప్రచారం చేస్తుందంటూ కొట్టిపారేశారు. మణిపూర్ అల్లర్ల ద్వారా రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నించవద్దని హెచ్చరించారు. మణిపూర్ పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తాయని..రాహుల్ వంటి నాయకుల వల్ల ఎలాంటి సానుకూల ఫలితాలు ఉండవన్నారు.

Translate this News:

ఈశాన్యరాష్ట్రమైన మణిపూర్ లో గత కొన్నాళ్లుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో రాజకీయ నాయకుడి కంటే కరుణ అవసమన్నారు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ. జాతికలహాలతో అడ్డుకుడుకుతున్న రాష్ట్రంలో రాహుల్ పర్యటన గురించి ప్రస్తావించారు. ఇదంతా కేవలం మీడియా ప్రచారం మాత్రమే అంటూ కొట్టిపారేశారు. మణిపూర్ పరిస్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరిస్తున్నాయన్న హిమంత బిశ్వ శర్మ…రాహుల్ వంటి నాయకుల పర్యటన వల్ల ఎలాంటి సానుకూల ఫలితాలు ఉండవన్నారు.

RAHUL VISIT MANIPUR

రాహుల్ ఒక్కరోజు మాత్రమే పర్యటిస్తున్నారు. అదంతా మీడియా ప్రచారం తప్పా మరొకటి కాదు. ఈ పర్యటనకు సంబంధించి సానుకూల ఫలితాలు వస్తే పరిస్థితి ఇంకోవిధంగా ఉండేది. కానీ ఇలాంటి పర్యటనల వల్ల ఎలాంటి ఫలితాలు ఉండవన్నారు.

#WATCH | Assam CM Himanta Biswa Sarma on Congress leader Rahul Gandhi's visit to Manipur, says, "…Considering the situation in Manipur, the central & state government are responsible to bring the situation there under control…There is no need for any political leader to go… pic.twitter.com/6eLJl1Miub

— ANI (@ANI) June 29, 2023

మణిపూర్ ఇప్పుడు గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటుందని..దీనిని రాజకీయం చేసేందుకు ఎవరూ ప్రయత్నించవద్దన్నారు. మణిపూర్ లో నెలకొన్న పరిస్థితులపై ట్విట్టర్ వేదికగా స్పందించారు అసోం సీఎం. మణిపూర్ లో నెలకొన్న పరిస్థితులు సానుభూతితో విభేదాలను పరిష్కరించుకోవాలన్నారు. ఒక రాజకీయ నాయకుడు తన పర్యటనను తప్పుదోవ పట్టించేందుకు ఉపయోగించుకోకూడదని..దేశ ప్రయోజనాలకు మంచిది కాన్నారు. ఇలాంటి ప్రయత్నాలను రాష్ట్రంలోని రెండు వర్గాలు తిరస్కరించాయన్నారు.

బీజేపీ కార్యాలయంపై మూకుమ్మడి దాడి:
మరోవైపు ఇంఫాల్‌లో గురువారం అర్థరాత్రి, బీజేపీ కార్యాలయంపై అల్లమూకలు మూకుమ్మడి దాడికి పాల్పడ్డాయి. అల్లమూకలను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించవలసి వచ్చింది. దీంతో ఆగ్రహించిన అల్లమూకలు రోడ్డుపై నిప్పంటించారు. పోలీసులకు, అల్లరిమూకలకు మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. అంతకుముందు, మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలోని ఒక గ్రామంలో గురువారం కవ్వింపు చర్యలకు పాల్పడటంతో సైన్యం కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన 125 మందికి:
ఇటీవల మణిపూర్‌లో పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత రాహుల్ గాంధీ మణిపూర్ వెళ్లారు. మే 3 నుంచి కుల హింసతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రానికి కాంగ్రెస్‌ నేత రావడం ఇదే తొలిసారి. మణిపూర్‌లో మెయిటీ కమ్యూనిటీని ఎస్టీ కేటగిరీలో చేర్చే అంశంపై కుకీ, మైతేయి కమ్యూనిటీల మధ్య హింస కొనసాగుతోంది, ఇందులో ఇప్పటివరకు 125 మందికి పైగా మరణించారు. హింస దృష్ట్యా, రాష్ట్రంలో ఇంటర్నెట్‌ను నిషేధించారు. రాష్ట్రంలో 36 వేల మంది భద్రతా సిబ్బంది, 40 మంది ఐపీఎస్‌లను నియమించారు. ఇంత జరుగుతున్నా మణిపూర్‌లో హింస మాత్రం ఆగడం లేదు.

 

Primary Sidebar

KCR: వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్

KCR: వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్

Telangana Cabinet: ఈనెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Telangana Cabinet: ఈనెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త

Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త

Nara Lokesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేష్ భేటీ

Nara Lokesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేష్ భేటీ

waheeda, dada saheb award

movies:ఏరువాక సాగారో నటి వహీదా రహమాన్ కు దాదా సాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం

lawrence met rajini

movies:రజనీ కాళ్ళు మొక్కిన లారెన్స్ రాఘవ

aleru mla sunitha

Big Breaking: ఆలేరు ఎమ్మెల్యే సునీతకు హైకోర్టు షాక్

niharika in USA

Niharika:అమెరికా వీధుల్లో మెగా అమ్మాయి గ్లామర్ షో

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online