Arrest warrant to Selvamani: ఏపీ మంత్రి రోజాకు (Minister Roja) షాక్ తగిలింది. ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణిపై నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పరువునష్టం కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో చెన్నై జార్జ్టౌన్ కోర్టు (Chennai court) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో ముకుల్చంద్ బోత్రా అనే సినిమా ఫైనాన్షియర్ ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెల్వమణి.. ముకుంద్చంద్ కారణంగా తాను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బోత్రా.. సెల్వమణి (Selvamani)పై పరువునష్టం దావా వేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో బోత్రా కన్నుమూశారు.
పూర్తిగా చదవండి..Minister Roja: మంత్రి రోజా భర్త సెల్వమణికి నాన్ బెయిలబుల్ వారెంట్
ఏపీ మంత్రి రోజాకు షాక్ తగిలింది. ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణిపై నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పరువునష్టం కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో చెన్నై జార్జ్టౌన్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Translate this News: