పెళ్లి కాకుండానే రెండోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..!
‘ఊపిరి’ సినిమాలో తళుక్కున మెరిసిన అందాల ముద్దుగుమ్మ.. "గాబ్రియెల్లా డెమోట్రియాడ్స్" పెళ్లి కాకుండానే రెండోసారి తల్లి కాబోతున్నారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ మోడల్ బాలీవుడ్ నటుడు, హీరో అర్జున్ రాంపాల్ తో గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఈ జంటకు ఇప్పటికే ఓ కొడుకు ఉన్నాడు. తాజాగా బేబీ బంప్తో ఉన్న ఫోటోలను ఈ మోడల్ ఇన్ స్టా లో షేర్ చేసింది.
గాబ్రియెల్లా డెమోట్రియాడ్స్ పెళ్లి కాకుండానే రెండోసారి తల్లి
2018 నుంచి హీరో అర్జున్ రాంపాల్తో సహజీవనం
ఇప్పటికే ఈ జంటకు ఓ కొడుకు
బేబీ బంప్తో ఉన్న ఫోటోలు షేర్
వైరల్ అవుతున్న ఫోటోలు
విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
తెలుగు మూవీ ఊపిరి సినిమా ఎంత హిట్ అయిందో మనందరికి తెలిసిందేగా.. ఆ చిత్రంలో నాగార్జునతో కలిసి బెల్లి డ్యాన్స్ చేసి టాలీవుడ్ ఫ్యాన్స్ని తన బుట్టలో వేసుకుంది అందాల భామ "గాబ్రియెల్లా డెమోట్రియాడ్స్" అయితే కొన్నేళ్లుగా తన బాయ్ ప్రెండ్తో కలిసి సహజీవనం సాగిస్తున్న ఈ భామకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా.. అర్జున్ రాంపాల్, గాబ్రియెల్లా 2018 నుంచి సహజీవనం చేస్తున్నారు. ఈ జంటకు 2019లో అరిక్ రాంపాల్ పుట్టాడు. ఈ ఏడాది ఏప్రిల్ 29న తాను మరోసారి గర్భం దాల్చినట్లు గాబ్రియెల్లా సోషల్మీడియా వేదికగా వెల్లడించారు. అయితే అర్జున్ రాంపాల్కు ఇదివరకే పెళ్లి కాగా తనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజాగా ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు మరి పెళ్లి ఎప్పుడు అంటూ గాబ్రియెల్లా డెమోట్రియాడ్స్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
🔴LIVE BREAKINGS: ఆ రెండు బ్యాంకుల లైసెన్సులు రద్దు!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Jr.NTR: తాత మెచ్చిన మనవడు.. నేడు తారక్ 42వ పుట్టిన రోజు
బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తాత వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా డెబ్యూ చేశారు. నేడు జూనియర్ ఎన్టీఆర్ 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు విషయలు మీకోసం.
యంగ్ హీరో జూనియర్ నందమూరి తారక రామారావు తన నటన, డ్యాన్స్తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తాత వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా డెబ్యూ చేసి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మెచ్చేలా నిలిచారు. నేడు జూనియర్ ఎన్టీఆర్ 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు విషయలు మీకోసం.
జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా 1983లో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటించారు. ఆ తర్వాత బాల రామాయణంలో నటించారు. ఇక హీరోగా 2001లో నిన్ను చూడాలని మూవీతో డెబ్యూగా మారాడు. ఆ తర్వాత వరుసగా స్టూడెంట్ నెం1, సింహ్రాది వంటి సినిమాలతో హిట్ కొట్టి అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు.
ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ భారీ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్కు చెప్పుకోదగ్గ హిట్లు అయితే పడలేదు. వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. విజయాల కోసం ఎన్నో ఏళ్లు వేచి చూశాడు. ఎన్టీఆర్కు మళ్లీ టెంపర్ మూవీతో హిట్ పడింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. టెంపర్ తర్వాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేతా వీర రాఘవ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్తో కలిసి ఆర్ఆర్ఆర్ మూవీ చేశాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యాన్స్ వేసిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా లభించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ వార్ 2 మూవీలో కూడా నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి నేడు టీజర్ వచ్చే అవకాశం ఉంది.
breaking news in telugu | today-news-in-telugu | telugu-news | latest-telugu-news | Live Breakings
May 20, 2025 22:03 IST
CSK vs RR : రాణించిన మాత్రే, దూబె, బ్రెవిస్.. రాజస్థాన్ టార్గెట్188
ఢిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై బ్యాటింగ్ దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
May 20, 2025 20:49 IST
Covid-19 Cases : కరోనా మరణాలు మళ్లీ మొదలయ్యాయి.. కేరళ, ముంబైలో భారీగా కేసులు!
కరోనా కేసుల పెరుగుదలే ఆందోళనకరమంటే ముంబైలో కరోనా సోకిన ఇద్దరు తాజాగా మృతి చెందడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో 14ఏళ్ల బాలుడు, 54ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతిచెందారు.
corona-virus
May 20, 2025 17:14 IST
యాదాద్రిలో ఫ్రెండ్స్ తో కలిసి కల్వకుంట్ల హిమాన్షు పూజలు-PHOTOS
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు హిమాన్షు తన స్నేహితులతో కలిసి మంగళవారం ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. హిమాన్షు వెంట మాజీ ఎమ్మెల్యే సునీతా, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
Himanshu At Yadadri Temple
May 20, 2025 17:13 IST
AP Cabinet : గుడ్ న్యూస్.. 35 వేల ఉద్యోగాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ అదిరిపోయే శుభవార్త!
ఏపీ లెదర్ ఫుట్వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు కేబినెట్లో ఆమోదం లభించింది. రూ.30 వేల కోట్ల పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు కేబినెట్ ఆమోద ముద్రవేసింది.
రైల్లో హిజ్రాలు రెచ్చిపోయారు. ఓ ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ. 10వేలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలులో సదురు ప్రయాణికుడి వద్ద డబ్బులు డిమాండ్ చేసిన వాళ్లు ఆపై అతని వద్ద పర్సు లాక్కున్నారు.
May 20, 2025 15:37 IST
World's Fastest Spacecrafts: ప్రపంచంలో అత్యంత వేగవంతమైన టాప్ 5 స్పేస్క్రాఫ్ట్స్ ఇవే..!
2025 నాటికి వేగవంతమైన టాప్ 5 స్పేస్క్రాఫ్ట్లు - పార్కర్ సోలార్ ప్రోబ్, హెలియోస్ 1 & 2, న్యూ హారైజన్స్, వోయజర్ 1. ఇవి అత్యధిక వేగంతో అంతరిక్ష అన్వేషణను ముందుకు తీసుకెళ్లాయి. వేగం, అంతరిక్ష ప్రయాణాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది.
World's Fastest Spacecrafts
May 20, 2025 14:25 IST
BIG BREAKING: కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. హరీష్, ఈటలకు కూడా!
కాలేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, హరీష్, ఈటలకు పీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్కు సూచించింది. జూన్ 6 హరీష్ రావు, జూన్ 9న ఈటెల రాజేందర్ను విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.
KCR
May 20, 2025 13:12 IST
షూటింగ్ లో రాశీ ఖన్నాకు గాయాలు.. ముక్కు నుంచి రక్తం కారుతూ!
నటి రాశీఖన్నా షూటింగ్ లో గాయపడ్డారు. ముక్కు నుంచి రక్తం కారుతూ.. చేతులకు మొహానికి గాయాలైన ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలను షేర్ చేస్తూ ఓ క్యాప్షన్ పెట్టారు.. 'కొన్ని రోల్స్ అడగవు.. డిమాండ్ చేస్తాయి. నీ శరీరం, శ్వాస, గాయాలను లెక్క చేయకూడదు అని పెట్టారు.
భారీగా కురిసిన వర్షాలకు బెంగళూరు అతలాకుతలం అయ్యింది. ఎక్కడ చూసినా కూడా అంతా నీటిమయం కనిపిస్తోంది. అయితే రన్నింగ్ బస్సులో కూర్చొన్న సీట్ల వరకు వర్షం నీరు వచ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
May 20, 2025 13:10 IST
బార్డర్లో వరంగల్ జవాన్ ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకుని.. కారణం అదేనా?
వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాదం చోటుచేసుకుంది. ఆర్మీ జవాన్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. జమ్ముకశ్మీర్లోని సాంబ సెక్టార్లో విధులు నిర్వహిస్తున్న నాగరాజు.. అక్కడే తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారు. కుటుంబ కలహాలే జవాన్ ఆత్మహత్య కారణమని తెలుస్తోంది.
Warangal Army jawan Nagaraju death
May 20, 2025 13:10 IST
ప్రిన్సిపల్పై లేడీ టీచర్ యాసిడ్ దాడి.. అలా చేశాడనే పగతో దారుణం!
ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో దారుణం జరిగింది. డాన్ బోస్కో స్కూల్ లో పనిచేస్తున్న లేడీ టీచర్ ప్రిన్సిపల్ విజయ ప్రకాష్ పై యాసిడ్ దాడి చేసింది. ఆమెను విధుల నుంచి తొలగించారనే కోపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
NTR District_ lady teacher acid attack on principle
May 20, 2025 13:09 IST
కేసీఆర్ కు జైలు తప్పదా? కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్!
కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక తుదిదశకు చేరుకుంది. ఇందులో కీలకంగా వ్యవహరించిన కేసీఆర్కు వారం రోజుల్లోపు కమిషన్ సమన్లు పంపించే అవకాశం ఉంది. దీంతో క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత కేసీఆర్కు జైలు తప్పదా? అనే చర్చ ఊపందుకుంది.
kcr klswrm Photograph: (kcr klswrm)
May 20, 2025 11:03 IST
ఆ రెండు బ్యాంకుల లైసెన్సులు రద్దు!
నిబంధనలు పాటించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేసింది. అహ్మదాబాద్లోని కలర్ మర్చంట్స్ కో-ఆప్ బ్యాంక్ లైసెన్స్ను ఆర్బీఐ గత నెల రద్దు చేసింది. ఇప్పుడు లక్నోలోని HCBL కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేసింది.
May 20, 2025 11:03 IST
భలే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. తులం మీద 450 దాకా తగ్గింపు కనిపిస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గింది. దీంతో రూ. 87,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 95,020 వద్ద ట్రేడ్ అవుతోంది.
Gold
May 20, 2025 09:11 IST
సరదాగా ప్రాణం తీసేశారు.. యువకుడి మలద్వారంలో వాటర్ పైపు పెట్టి ఫ్రెండ్స్ ఏం చేశారంటే!
నలుగురు స్నేహితులు కలిసి మనోజ్ను దారుణంగా చంపేసిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. సరదాగా ఓ ఫామ్హౌస్కి వెళ్లగా అక్కడ నలుగురు స్నేహితులు కలిసి మనోజ్ మలద్వారంలో వాటర్ పైపు పెట్టి చంపేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Haryana friends murder
May 20, 2025 09:10 IST
పాక్ చేతికి కీలక సమాచారం.. కశ్మీర్ To కన్యాకుమారి గూఢచర్య నెట్వర్క్!
పహల్గాం ఘటనపై భయంకర నిజాలు బయటపడుతున్నాయి. పాకిస్తాన్కు కీలక సమాచారం చేరవేసేందుకు ఇండియాలో కశ్మీర్ To కన్యాకుమారి గూఢచర్య నెట్వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేయగా మరికొంతమందిని అదుపులోకి తీసుకోనున్నారు.
తెలంగాణ రాజ్భవన్లో చోరీ.. కీలక ఫైల్స్, హార్డ్ డిస్క్లు మాయం!
తెలంగాణ రాజ్భవన్లో దొంగలుపడ్డారు. సుధర్మభవన్లో మే 14న కీలకమైన రిపోర్టులు, ఫైల్స్, 4 హార్డ్ డిస్క్లు ఎత్తుకెళ్లారు. రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా CC ఫుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
tg rajbhavan Photograph: (tg rajbhavan)
May 20, 2025 09:09 IST
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు అంగీకారం..ట్రంప్
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఎట్టకేలకు శాంతి చర్చలకు బీజం పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు గంటలు చర్చలు జరిపిన తర్వాత ఆయన దీన్ని అధికారికంగా ధృవీకరించారు. మరోవైపు తాను కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నానని జెలెన్ స్కీ ప్రకటించారు.
ఆర్మూరులో మరో గురుమూర్తి.. కన్నబిడ్డల ముందే భార్య గొంతుకోసి..!
తెలంగాణలో మరో గురుమార్తి తరహా ఘటన సంచలనం రేపింది. నిజమాబాద్ ఆర్మూర్కు చెందిన గంగాధర్ అనుమానంతో భార్య అంజలిని గొంతుకోసి చంపాడు. పిల్లలు వద్దని వేడుకుంటున్న వినకుండా దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
murder nzb Photograph: (murder nzb)
May 20, 2025 07:37 IST
విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్..తొందరలోనే
భారత ప్రతిష్టాత్మక వందే భారత్ ట్రైన్ ఇప్పుడు విజయవాడ, బెంగళూరుల మధ్య కూడా నడవనుంది. దీని ద్వారా తొమ్మిది గంటల్లో గమ్యస్థానానికి చేరవచ్చును. ఇది కార్యరూపం దాలిస్తే దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది.
May 20, 2025 07:37 IST
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో తిరుపతి, నెల్లూరు, యానం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో నిజమాబాద్, మహబూబ్నగర్లో భారీగా వర్షాలు పడతాయి.
May 20, 2025 07:36 IST
SRH VS LSG: తాను పోయింది... లక్నోను తీసుకెళ్ళిపోయింది
అదేదో సామెత చెప్పినట్టు...ఎస్ఆర్హెచ్ తాను వెళ్ళిపోయింది ఎలానో వెళ్ళిపోక తనతో పాటూ లక్నోను కూడా ప్లే ఆఫ్స్ కు దూరం చేసింది. అసలు మ్యాచ్ లన్నింటిలోనూ ఓడిపోయిన హైదరాబాద్ నిన్న జరిగిన దానిలో మాత్రం గెలిచి...లక్నోను ఇంటికి పంపించేసింది.
SRH VS LSG
May 20, 2025 07:35 IST
పొడవకుండా రక్త పరీక్ష... నీలోఫర్ లో మొదటిసారి ప్రయోగం
వైద్యపరంగా నీలోఫర్ ఆసుప్రతి మరో అడుగు ముందుకు వేసింది. దేశంలోనే మొట్టమొదటిసారి సూదితో పొడవకుండా రక్త పరీక్షను నిర్వహించింది. ఏఐ ఆధారిత డయాగ్నొస్టిక్ సాధనాన్ని క్విక్ వైటల్స్ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.
AI based blood test mission
May 20, 2025 07:34 IST
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాకి చెందిన టూరిస్టులు పరిగిలో జరిగిన విందుకు బస్సులో వెళ్లారు. తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.