ఇవాళ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ జరుగనుంది. చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపైవ ఇచారణ జరుగనుంది. సీఐడీ వీటికి కౌంటర్లు దాఖలు చేయనుంది. అలాగే చంద్రబాబు కస్టడీ పిటిషన్పై ఏసీబీకోర్టులో విచారణ జరుగనుంది. ఇదిలాఉంటే.. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది సీఐడీ. ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబును పేరును చేరుస్తూ మెమో దాఖలు చేసింది. ఫైబర్ నెట్పై వేసిన పిటి వారెంట్కు అనుబంధంగా ఈ మెమో దాఖలు చేయనున్నారు సిఐడీ అధికారులు.