తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ కి ఓ నెటిజన్ గట్టిగా ఝలక్ ఇచ్చింది. మీరేమైనా మినిస్టరా..అని ఫైర్ అయింది. ఇక మ్యాటర్లోకి వెళితే..గత వారం రోజుల నుంచి తెలంగాణలో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో పిల్లలను స్కూల్స్ పంపించడానికి పేరెంట్స్ జంకుతున్నారు. జలమయమైన రోడ్లు, వరదనీరు, కరెంట్ స్తంభాలతో.. ప్రమాదానికి ఆస్కారం ఎక్కువగా ఉండడంతో స్కూళ్లకు సెలవులు ఇస్తేనే బెటర్ అని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.
పూర్తిగా చదవండి..మీరేమైనా మినిస్టరా.. మంత్రి సబితా తనయుడికి నెటిజన్ ఝలక్!
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ కి ఓ నెటిజన్ గట్టిగా ఝలక్ ఇచ్చింది.‘మీరు చూపించిన శ్రద్ధకు అభినందనలు కార్తీక్.. కానీ అది విద్యాశాఖమంత్రికి నేను చేసిన విన్నపం. మీరు సమాధానం ఇచ్చారంటే ఒక వేళ కొంపదీసి మీరు విద్యాశాఖమంత్రా.. అన్నట్టుగా కామెంట్ పెట్టారు. అంతే కాదు కార్తీక్ రెడ్డి తానేదో మంత్రిలా ఫీలవుతున్నారని.. తాను పిల్లలపై ఉన్న కన్సర్న్ తో మంత్రిని అడిగిన చిన్న ప్రశ్నకు వెటకారంగా సమాధానమిస్తున్నారని’ ఆమె పేర్కొన్నారు.
Translate this News: