Ayodhya Ram Mandir: యూపీనే కాదు..ఆ రాష్ట్రంలోనూ జనవరి 22న డ్రై డే...రామమందిర ప్రాణప్రతిష్ట దృష్ట్యా నిర్ణయం..!!

రాజస్థాన్‌లో జనవరి 22న డ్రై డేగా ప్రకటించింది ఆ రాష్ట్ర సర్కార్. రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్‌తో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాంలలో జనవరి 22న మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది.

New Update
Viral News: హనీమూన్‌ అని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లాడు..నాకు విడాకులు కావాలి!

Ayodhya Ram Mandir:  అయోధ్యారాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా తిలకించేందుకు ఊవిళ్లూరుతోంది. ఈ మధుర ఘట్టానికి సమయం దగ్గరపడుతుండటంతో రామభక్తులు కనులారా వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. దేశ వ్యాప్తంగా ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందజేసింది ఆలయ కమిటి. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ(pm modi) చేతుల మీదుగా ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 22న ఉత్తరప్రదేశ్ లో డ్రై డే(Dry day in Uttar Pradesh)గా ప్రకటించారు. మద్యం ,మాంసం విక్రయించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ తోపాటు ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాంలలో జనవరి 22న మద్యం అమ్మకాలపై నిషేధం ప్రకటించాయి. ఇప్పుడు రాజస్థాన్ (Rajasthan)కూడా జనవరి 22ను డ్రై డే గా ప్రకటించింది.

ఈ రాష్ట్రాల్లోనూ నిషేధం:
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా జనవరి 22న అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు మద్యం అమ్మకాలను నిషేధించాయి. రాజస్థాన్ కంటే ముందు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాంలలో జనవరి 22 న మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది.

జనవరి 22న యూపీలో పబ్లిక్ హాలిడే:
యూపీ ప్రభుత్వం జనవరి 22న రాష్ట్రవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించింది. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ఎక్సైజ్ కమిషనర్లు, జిల్లా మేజిస్ట్రేట్‌లకు జనవరి 22వ తేదీన మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ లేఖ రాసింది.

ఇది కూడా చదవండి: కాలుష్య కొరల్లో మరోసారి చిక్కుకున్న ఢిల్లీ.. రంగంలోకి ప్రభుత్వం..

రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ రాసిన లేఖలో, రాంలల్లా జీవితాన్ని జనవరి 22 న అయోధ్యలో పవిత్రం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మూసివేత కోసం లైసెన్స్‌దారు ఎటువంటి పరిహారం లేదా క్లెయిమ్‌కు అర్హులు కాదని ఈ లేఖలో పేర్కొంది. జిల్లా ఎక్సైజ్‌ అధికారులు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ తెలిపారు.

Advertisment
తాజా కథనాలు