APPSC Group-2: ఏపీలో గ్రూప్-2 పరీక్ష వాయిదా!

ఏపీలో ఈ నెల 28న జరగాల్సిన గ్రూప్-2 పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. పరిపాలన కారణాలతోనే గ్రూప్-2 పరీక్షను ఏపీపీఎస్సీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

New Update
APPSC Group-2: ఏపీలో గ్రూప్-2 పరీక్ష వాయిదా!

APPSC Group 2 Postponed: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ (Group 2 Mains) పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు వెబ్ నోట్లో పేర్కొంది. ఏపీలో 897 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ గతేడాది డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్, మరో 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.

ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షను ఈ ఏడాది ఫిబ్రవరి 25న నిర్వహించారు. ఫలితాలను ఏప్రిల్ 2వ వారంలో విడుదల చేసింది ఏపీపీఎస్సీ. జులై 28న మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. తాజాగా పరీక్షను వాయిదా వేస్తున్నట్లు వెబ్ నోట్ విడుదల చేసింది.
publive-image

ఇటీవల ప్రభుత్వం మారిన నేపథ్యంలో పరిపాలన కారణాలతో ఈ పరీక్షను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థులు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలకు సంబంధించిన అప్డేట్స్ ను https://portal-psc.ap.gov.in/ వెబ్ సైట్లో తెలుసుకోవచ్చని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు