Manish Sisodia : 17 నెలల తర్వాత ఇంట్లో టీ తాగుతున్నా: మనీష్ సిసోడియా

భారతీయులందరికీ రాజ్యాంగం స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించిందని అన్నారు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. 17 నెలల తరువాత ఇంట్లో టీ తాగుతున్నానని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా నిన్న లిక్కర్ స్కాం కేసులో ఆయనకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

New Update
Manish Sisodia : 17 నెలల తర్వాత ఇంట్లో టీ తాగుతున్నా: మనీష్ సిసోడియా

AAP Leader Manish Sisodia : లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో బెయిల్ నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ (Delhi) మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia) ట్విట్టర్ (X) లో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. 17 నెలల తర్వాత ఇంట్లో టీ తాగుతున్నా అని అతని భార్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. భారతీయులందరికీ రాజ్యాంగం స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించిందని అన్నారు. అందరితోపాటు కలిసి ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ భగవంతుడు మనకు ప్రసాదించాడు అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. మనీలాండరింగ్‌తో ముడిపడిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 17 నెలలు తిహాడ్‌ జైలులో ఉన్నారు ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) సీనియర్‌ నేత సిసోడియా.

Also Read : జైలు నుంచి విడుదలైన మనీష్ సిసోడియా..

Advertisment
తాజా కథనాలు