కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ ఫుల్ జోష్తో కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరుకు తెలంగాణలో అసలు రేసులోనే లేనట్టు కనిపించిన హస్తం పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్కు ముచ్చెమటలు పట్టిస్తోంది. అందుకే ఖమ్మం రాహుల్ గాంధీ సభకు కాంగ్రెస్ కార్యకర్తలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు తెలంగాణలో ఇప్పటికీ బలమైన క్యాడర్ కలిగిన కాంగ్రెస్..అటు ఏపీలో మాత్రం సమాధవడానికి దగ్గరగా ఉంది. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం ఎవరీ తరం కాదు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈ విషయం తెలియనది కాదు. తెలంగాణ తర్వాత ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికైనా ఓ అంచనాకు రాలేం కానీ..ప్రస్తుతనికైతే ఏపీ కాంగ్రెస్ ఓ పదునైన అస్త్రన్ని సిద్ధం చేసుకుంది. అదే విభజన హామీల అంశం. ఏపీ విభజన హామీలపై రాహుల్ గాంధీ అన్ని వివరాలు తెలుసుకున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని క్లియర్కట్గా స్పష్టం చేస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Congress: విభజన హామీలపై కలిసికట్టుగా ఏపీ, తెలంగాణ కాంగ్రెస్.. ఒకే దెబ్బకు రెండు కాదు మూడు పిట్టలు!
భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు పలువురు నాయకులు రాహుల్గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏపీ, తెలంగాణ కాంగ్రెస్లు విభజన హామీల అంశంపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. విభజన హామీల అంశంపై రాహుల్ గాంధీ ఫోకస్ చేశారన్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఇటు కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైతం ఏపీకి జరిగిన అన్యాయంపై పెదవి విప్పారు.
Translate this News: