వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏ ఎన్నికనూ.. ప్రజామోదంతో గెలవలేదని టీడీపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అమరావతిలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగాలని టీడీపీ కోరుకుంటోందన్నారు. ఏపీలో ఓట్ల దొంగలు పడ్డారని మేము ముందే చెప్పామని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రతిపక్షాల ఓట్లన్నీ తొలగించే కార్యక్రమం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అందుకే ఓటర్ల జాబితాపై ముందు నుంచి ఫిర్యాదు చేస్తున్నామని ఆయన అన్నారు. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా సీఈసీకి ఫిర్యాదు చేశారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. పర్చూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఅర్ నమోదు చేసినా తదుపరి చర్యలు లేవని ఆయన మండిపడ్దారు.
పూర్తిగా చదవండి..AP News: అమిత్షాను లోకేష్ కలిసింది అందుకే.. అచ్చెన్నాయుడు సంచలన వాఖ్యలు
అమిత్షా దేశానికి కేంద్రమంత్రి కాబట్టి ఆయనను నారా లోకేష్ కలిసి చంద్రబాబు కేసులకు సంబంధించిన అన్ని వివరాలను వివరించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదనీ అమిత్షా ఈ సందర్భంగా లోకేష్ తో చెప్పారని వివరించారు. ఉత్తరాంధ్ర ప్రకృతి వనరులను దోచుకోడానికే జగన్ విశాఖ వెళ్తున్నాడని ధ్వజమెత్తారు.
Translate this News: