ఓవైపు 2014 విన్నింగ్ స్టోరీని రిపీట్ చేయాలని పవన్ కల్యాణ్(Pawan Kalyan) భావిస్తుంటే..మరోవైపు బీజేపీ మాత్రం చంద్రబాబు(Chandrababu) లేకుండానే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుందా..? 2014ఎన్నికలకు చంద్రబాబు ఎన్డీయే(NDA)లోనే భాగంగా ఉన్నారు..నాలుగేళ్ల తర్వాత కూటమి నుంచి బయటకొచ్చి యూపీఏతో జతకట్టారు..ఇప్పుడు మళ్లీ బీజేపీ-జనసేనతో కలిసి పని చేయాలనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకు బలాన్ని చేకూర్చేలా చంద్రబాబు గతంలోనే అమిత్షా(Amitshah)తో భేటీ కూడా అయ్యారు. ప్రచారాల్లో, మీటింగ్ల్లో బీజేపీని పల్లెత్తు మాట కూడా అనడంలేదు..ఇలా ఈ మూడు పార్టీలు కలిసే పోటి చేస్తాయన్న సంకేతాలు జనాల వరకు వెళ్లాయి కానీ..ఇప్పటివరకు ఇటు టీడీపీ నుంచి కానీ.. అటు బీజేపీ-జనసేన నుంచి ఓ క్లారిటీ అయితే రాలేదు. ఇదే సమయంలో జరిగిన ఎన్డీయే మిత్రపక్ష మీటింగ్కు జనసేన(Janasena) అధినేత హాజరవుతుండగా..అసలు టీడీపీ(TDP)కే పిలుపే రాకపోవడం ఆ పార్టీ క్యాడర్ని సైతం కన్ఫ్యూజన్లో పడేసింది. ఇంతకి ఏపీ(AP)లో ఏం జరుగుతోంది..? ఎన్డీయే మీటింగ్కి టీడీపీని పిలవకపోవడంలో అంతర్యమేంటి..?
పూర్తిగా చదవండి..NDA Meet Delhi: ఏపీనాట రక్తి కట్టిస్తోన్న ట్రయాంగిల్ లవ్..! ఎన్డీయే మీటింగ్కి టీడీపీని పిలవకపోవడంలో అంతర్యమేంటి..?
ఎన్డీయే మిత్రపక్ష సమావేశానికి జనసేనను మాత్రమే బీజేపీ ఆహ్వానించడంపై వివిధ రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీని బీజేపీతో దగ్గర చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని.. కానీ కమలం పార్టీ నుంచే ఇప్పటివరకు ఎలాంటి కన్ఫర్మేషన్ లేదని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
Translate this News: