Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ కోసం పోలీసుల వేట..!

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కోసం ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో మూడు ప్రత్యేక బృందాలతో మాజీ మంత్రి కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు.

Jogi Ramesh: జోగి రమేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
New Update

Jogi Ramesh: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కోసం ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో జోగి రమేష్‌ ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే, ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Also Read: వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా..!

ప్రస్తుతం, హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు జోగి రమేష్‌, ఆయన అనుచరుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మూడు ప్రత్యేక బృందాలతో మాజీ మంత్రి కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సురేశ్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేయగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నందిగం సురేశ్ హైదరాబాద్ మియాపూర్ లో ఉన్నారని పక్కా సమాచారం ఉండటంతో మియాపూర్ వెళ్లి నందిగం సురేశ్ ను అదుపులోకి తీసుకున్నారు.

#jogi-ramesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe