Pinnelli Ramakrishna Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం?

AP: నేటితో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ గడువు ముగుస్తోంది. ఈవీఎం ధ్వంసం కేసుతో సహా మరో రెండు కేసులపై ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. కాగా పిన్నెల్లికి బెయిల్ వస్తుందా? లేదా అరెస్ట్ అవుతారా? అనే ఉత్కంఠ పల్నాడులో నెలకొంది.

Andhra Pradesh: పిన్నెల్లికి మరో షాక్‌.. పోలీసు కస్టడీకి పర్మిషన్
New Update

Pinnelli Ramakrishna Reddy: నేటితో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ గడువు ముగుస్తోంది. ఈవీఎం ధ్వంసం కేసుతో సహా మరో రెండు కేసులపై ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. కాగా పిన్నెల్లికి బెయిల్ వస్తుందా? లేదా అరెస్ట్ అవుతారా? అనే ఉత్కంఠ పల్నాడులో నెలకొంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘోర ఓటమి చెందిన విషయం తెలిసిందే.

షరతులతో కూడిన బెయిల్..

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో బిగ్‌రిలీఫ్‌ దక్కింది. మూడు కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ ను హైకోర్టు మంజూరు చేసింది. ఎన్నికల కౌంటింగ్‌ అయ్యే వరకు అరెస్ట్‌ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్‌ పై ఉన్నారు పిన్నెల్లి. ఇవి కాక పిన్నెల్లిపై మరో మూడు కేసులు నమోదు అయ్యాయి. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిపై దాడి చేశారని ఒక కేసు, కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి విషయంలో కేసు, పాల్వాయిగేటులో నాగ శిరోమణిపై దాడికి సంబంధించి మరో కేసు మొత్తం మూడు కేసులు నమోదు అయ్యాయి. ఈ మూడు కేసుల్లో అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. కాగా పోలింగ్ జరిగిన రోజు నుంచి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్న విషయం తెలిసిందే. 

బెయిల్ షరతులు..

1.ప్రతిరోజు ఎస్పీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలి.

2.నరసరావుపేట లో ఎక్కడ ఉంటారో పూర్తి అడ్రెస్స్, సెల్ నెంబర్ తో సహా ఎస్పీ ఆఫీసులో ఇవ్వాలి.

3. పాస్ పోర్ట్ కోర్టులో సరెండర్ చేయాలి.

#pinnelli-ramakrishna-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe