Jagan: కూటమిని సింగిల్‌ డిజిట్‌ కు పరిమితం చేస్తాం.. జగన్ సంచలన వ్యాఖ్యలు

ఇప్పటికే మూడు నెలల సమయం గడిచి పోయిందని.. ఐదేళ్లు కూడా ఇట్టే గడిచిపోతుందని జగన్ ఈ రోజు తన పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమేనని.. కూటమిని సింగిల్ డిజిట్ కు పరిమితం చేస్తామని వాఖ్యానించినట్లు సమాచారం.

Jagan: కూటమిని సింగిల్‌ డిజిట్‌ కు పరిమితం చేస్తాం.. జగన్ సంచలన వ్యాఖ్యలు
New Update

ఈ రోజు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా వైసీపీ అధినేత జగన్.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో ఈ రోజు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఇప్పటికే మూడు నెలల కాలం గడిచిపోయింది.. ఐదేళ్లు కుడా ఇట్టే గడిచి పోతుందని అన్నట్లు తెలుస్తోంది. అందరూ ధైర్యంగా ఉండాలని.. తిరిగి మనం అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Raghurama Raju: RRR సంచలనం.. నేరుగా జగన్ దగ్గరికి వెళ్ళి చెవిలో వార్నింగ్!

2029 ఎన్నికల్లో కూటమిని సింగిల్‌ డిజిట్‌ కు పరిమితం చేస్తామని కూడా అన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అవును సార్.. గత ఐదేళ్లు కూడా ఇట్టే గడిచిపోయాయాని అన్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్, ఎమ్మెల్యేలు ఒక్కసారిగా నవ్వినట్లు సమాచారం. ఢిల్లీలో నిర్వహించే దీక్షకు అందరూ హాజరవ్వాలని జగన్ ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలిసింది.



#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe