ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత జగన్ తొలిసారి పులివెందుల వెళ్తుండడంతో ఆయన పర్యటనకు ప్రాధాన్యత నెలకొంది. మూడు రోజుల పాటు జగన్ పులివెందులలోనే ఉండనున్నారు. రాయలసీమలోని ముఖ్య నేతలు, కార్యకర్తలతో జగన్ ఈ మూడు రోజుల పాటు సమావేశం కానున్నారు. అండగా ఉంటానని.. అధైర్య పడొద్దని జగన్ వారిలో భరోసా నింపే అవకాశం ఉందని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..AP Ex CM Jagan: అసెంబ్లీకి రాను.. జగన్ సంచలన నిర్ణయం!
రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరుకావడం లేదు. రేపు సొంత నియోజకవర్గం పులివెందులకు ఆయన వెళ్లనున్నారు. కీలకమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో జగన్ సభకు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.
Translate this News: